News November 22, 2024

ఐదేళ్ల క్రితమే CBN కుట్ర చేశారని YCP బాంబ్

image

AP: కరెంట్ ఛార్జీలతో పాతికేళ్లు రాష్ట్ర ప్రజల నడ్డి విరిచేందుకు ఐదేళ్ల క్రితమే చంద్రబాబు కుట్ర చేశారని ట్రూత్ బాంబ్ పేరుతో YCP ‘X’లో పోస్ట్ చేసింది. 2019లో కమీషన్ల కోసం యూనిట్‌కు రూ.5.90 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. కానీ, 2021లో సెకీతో YCP యూనిట్‌కి రూ.2.49తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. ‘ఇప్పుడు చెప్పు చంద్రబాబు, అసలైన అవినీతిపరుడు నువ్వు కాదా?’ అని ప్రశ్నించింది.

Similar News

News November 24, 2025

చెరకు నరికిన తర్వాత ఆలస్యం చేస్తే..

image

చెరకు నరికిన తర్వాత రోజులు, గంటలు గడుస్తున్నకొద్దీ గడలలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. ఈ గడలను గానుగాడించకుండా ఉంచితే.. నిల్వ కాలం పెరిగేకొద్దీ బరువు తగ్గుతుంది. చెరకు నరికిన తర్వాత 24 గంటలు ఆలస్యమైతే 1.5%, 48 గంటలు ఆలస్యమైతే 3%, 72 గంటలు ఆలస్యమైతే 5% వరకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. అదే విధంగా రసనాణ్యతలోనూ 0.4%-0.6% వరకు క్షీణత కనిపిస్తుంది. నరికిన చెరకును నీడలో ఉంచితే ఈ నష్టం కొంత తగ్గుతుంది.

News November 24, 2025

పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

image

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్‌ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.

News November 24, 2025

అమెరికా వీసా రాలేదని..

image

ట్రంప్ కఠిన వీసా నిబంధనలు తెలుగు డాక్టర్ మరణానికి కారణమయ్యాయి. US వీసా రాలేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి HYDలో ఆత్మహత్య చేసుకున్నారు. MBBS చేసిన ఆమె USలో PG చేసేందుకు J1 వీసాకు దరఖాస్తు చేశారు. HYDలోని US కాన్సులేట్‌లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో ‘శాశ్వతంగా USలోనే ఉండిపోవాలనే ఉద్దేశం’ అని కారణాన్ని చూపుతూ రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రోహిణి సూసైడ్ చేసుకున్నారు.