News November 22, 2024

అదానీ స్కాంలో జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు.. ఖండించిన వైసీపీ

image

AP: వైఎస్ జగన్ ప్రభుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందనే <<14673251>>ఆరోపణలను<<>> వైసీపీ ఖండించింది. ‘ఏపీ డిస్కంలకు అదానీ గ్రూపునకు చెందిన ఇతర సంస్థలతో డైరెక్ట్ అగ్రిమెంట్ కుదరలేదు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన SECIతో CERC ఆమోదంతో 2021లో డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవడంతో రాష్ట్రానికి ఏడాదికి రూ.3వేల కోట్లు మిగిలాయి. రాష్ట్ర ప్రభుత్వంపై మోపిన అభియోగాలు తప్పు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News December 6, 2025

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. నిన్న APలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీలు, అరకులో 11, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు TGలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News December 6, 2025

రిలేషన్‌షిప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా?

image

దాంపత్య జీవితంలో చిన్న తప్పులు కూడా ఇద్దరి మధ్య దూరం పెంచేస్తాయని రిలేషన్‌షిప్ కౌన్సిలర్స్ హెచ్చరిస్తున్నారు. ‘మీ పార్ట్‌నర్ మాట్లాడేటప్పుడు పట్టనట్లు ఫోన్ చూసుకోకండి. చిన్న విషయాలకు కూడా కేకలు వేయకండి. ఏ చిన్న పనైనా మీ పార్ట్‌నర్‌తో డిస్కస్ చేయకుండా మొదలు పెట్టకండి. ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోవాలి. ఏ రోజు డిఫరెన్సెస్‌ని ఆరోజే మాట్లాడుకుంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది’ అని సూచిస్తున్నారు.

News December 6, 2025

నేడు అమెరికాకు మంత్రి లోకేశ్

image

AP: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్‌లోని తెలుగువారిని కలుస్తారు. 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరెంటోలో పర్యటిస్తారు. ఈ 18 నెలల్లో లోకేశ్ అమెరికా వెళ్లడం రెండోసారి కావడం విశేషం. ఇప్పటివరకు US, దావోస్, సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.