News November 22, 2024

అదానీ స్కాంలో జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు.. ఖండించిన వైసీపీ

image

AP: వైఎస్ జగన్ ప్రభుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందనే <<14673251>>ఆరోపణలను<<>> వైసీపీ ఖండించింది. ‘ఏపీ డిస్కంలకు అదానీ గ్రూపునకు చెందిన ఇతర సంస్థలతో డైరెక్ట్ అగ్రిమెంట్ కుదరలేదు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన SECIతో CERC ఆమోదంతో 2021లో డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవడంతో రాష్ట్రానికి ఏడాదికి రూ.3వేల కోట్లు మిగిలాయి. రాష్ట్ర ప్రభుత్వంపై మోపిన అభియోగాలు తప్పు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News November 27, 2025

కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

image

AP: దిత్వా తుఫాను ప్రభావంతో రేపు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. ‘శనివారం అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది’ అని పేర్కొంది.

News November 27, 2025

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సిటీ ఏదో తెలుసా?

image

ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన నగరంగా ఇండోనేషియాలోని జకార్తా నిలిచింది. అక్కడ 4.19 కోట్ల మంది నివసిస్తున్నారు. 3.66 కోట్లతో బంగ్లాదేశ్‌లోని ఢాకా రెండో స్థానంలో ఉంది. టోక్యో(జపాన్) 3.34 కోట్ల జనాభాతో మూడో స్థానం, 3 కోట్ల మందితో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. 2050 నాటికి ఢాకా ఈ లిస్టులో తొలి స్థానానికి చేరే అవకాశం ఉందని ప్రపంచ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్-2025 రిపోర్టులో ఐక్యరాజ్యసమితి తెలిపింది.

News November 27, 2025

తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

image

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజు 3,242 సర్పంచ్, 1,821 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.