News March 30, 2024

YCP ఇచ్చేది రూ.10.. దోచేది రూ.100: బాబు

image

AP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ప్రజలకు రూ.10 ఇస్తూ.. రూ.100 దోచుకుంటుందని ఆరోపించారు. ‘పేదలకు సాయం చేయాలని జగన్‌కు లేదు. ఈ ఐదేళ్లలో ఎలాంటి మార్పు జరగలేదు. జగన్ పాలనలో అన్ని వర్గాలూ దెబ్బతిన్నాయి. రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవాలని ఆయన ఆశ. వైసీపీని ఓడించేందుకు ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నారు. మేం ఎప్పుడూ పేదల పక్షమే’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 10, 2025

U19 హెడ్ కోచ్‌పై క్రికెటర్ల దాడి.. CAPలో కలకలం

image

పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్(CAP)లో కోచ్‌పై దాడి జరగడం కలకలం రేపింది. U19 హెడ్ కోచ్ వెంకటరామన్‌పై ముగ్గురు లోకల్ క్రికెటర్లు బ్యాటుతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు గాయమై 20 కుట్లు పడ్డాయి. SMATకు ఎంపిక చేయకపోవడంతోనే ఈ అటాక్ జరిగినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లోకల్ ప్లేయర్లను కాదని ఫేక్ డాక్యుమెంట్లతో నాన్ లోకల్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తున్నారని CAPపై ఆరోపణలున్నాయి.

News December 10, 2025

150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>RITES <<>>150 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జనవరి 11న రాత పరీక్ష నిర్వహిస్తారు. నెలకు జీతం రూ.29,735 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News December 10, 2025

అన్‌క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

image

బ్యాంకుల్లో ₹78,000Cr అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్‌లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.