News March 30, 2024
YCP ఇచ్చేది రూ.10.. దోచేది రూ.100: బాబు

AP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ప్రజలకు రూ.10 ఇస్తూ.. రూ.100 దోచుకుంటుందని ఆరోపించారు. ‘పేదలకు సాయం చేయాలని జగన్కు లేదు. ఈ ఐదేళ్లలో ఎలాంటి మార్పు జరగలేదు. జగన్ పాలనలో అన్ని వర్గాలూ దెబ్బతిన్నాయి. రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవాలని ఆయన ఆశ. వైసీపీని ఓడించేందుకు ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నారు. మేం ఎప్పుడూ పేదల పక్షమే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 4, 2026
చిరంజీవి ‘వారసుడు’ కామెంట్లపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన లావణ్య

రామ్చరణ్కు కవలలు పుట్టడంతో చిరంజీవి గతంలో చేసిన ‘వారసుడు’ కామెంట్లపై పలువురు SMలో విమర్శలు చేశారు. దీనిపై మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు. ‘మీ పోస్ట్ అభ్యంతరకరంగా, ఆనందకరమైన క్షణాలను తుడిచిపెట్టేలా ఉంది. కుటుంబంలోని మహిళలు, మనవరాళ్లతో చిరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మీకు తెలియదు. ఆయన చేసేదాంట్లో చాలామంది 1% కూడా చేయరు. తెలియని వ్యక్తుల గురించి మాట్లాడొద్దు’ అని హితవు పలికారు.
News February 4, 2026
ఇండియన్ ఆర్మీలో JAG ఎంట్రీ స్కీమ్కు దరఖాస్తుల ఆహ్వానం

<
News February 4, 2026
ఘోస్ట్ జాబ్స్ గురించి తెలుసా?

కొన్ని కంపెనీలు కావాలనే లేని జాబ్ ఆఫర్స్ను జాబ్ పోర్టల్స్లో పోస్ట్ చేస్తుంటాయి. వీటినే ఘోస్ట్ జాబ్స్ అంటారు. వీటికి అప్లై చేసుకుంటే స్పందన కోసం నెలల కొద్దీ వేచి చూడాలి. కంపెనీ యాక్టివ్గా ఉందని, గ్రో అవుతోందని ఇన్వెస్టర్లకు, క్లయింట్లకు చూపించడానికి, అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసుకోవడానికి ఈ పద్ధతిని ఫాలో అవుతుంటాయి. అయితే ఇవి దీర్ఘకాలంలో కంపెనీలు, ఉద్యోగార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.


