News December 13, 2024

పలువురికి పదవులు కేటాయించిన YCP

image

AP: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(PAC) మెంబర్‌గా YCP నియమించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ CM జగన్ ఆదేశాల మేరకు నియామకం జరిగింది. అటు, వినుకొండ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సలేహా ఖాన్‌ను పల్నాడు జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షుడిగా నియమించింది. అలాగే, మైలవరం నియోజకవర్గానికి చెందిన పామర్తి శ్రీనివాసరావును NTR జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ YCP ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News November 24, 2025

అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

image

TG: పటాన్‌చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్‌కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.

News November 24, 2025

ఎల్లుండి ఇలా చేస్తే వివాహ సమస్యలు దూరం!

image

ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఈరోజున సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్త్రోత్ర పారాయణం, వల్లీ-దేవసేన కళ్యాణం వంటివి చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇవి చేస్తే జాతక పరంగా వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, పిల్లల బుద్ధి కుశలత, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. SHARE IT

News November 24, 2025

ఇక సెలవు.. ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి

image

బాలీవుడ్ నటుడు <<18374925>>ధర్మేంద్ర<<>> (89) అంత్యక్రియలు ముగిశాయి. తొలుత ఆయన పార్థివ దేహాన్ని ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఆయన్ను కడసారి చూసేందుకు సినీతారలు, అభిమానులు భారీగా వచ్చారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్ తదితర సినీ తారలు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు తుది నివాళులు అర్పించారు.