News December 13, 2024
పలువురికి పదవులు కేటాయించిన YCP

AP: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(PAC) మెంబర్గా YCP నియమించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ CM జగన్ ఆదేశాల మేరకు నియామకం జరిగింది. అటు, వినుకొండ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సలేహా ఖాన్ను పల్నాడు జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షుడిగా నియమించింది. అలాగే, మైలవరం నియోజకవర్గానికి చెందిన పామర్తి శ్రీనివాసరావును NTR జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ YCP ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News November 17, 2025
ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు!

రంజీ ట్రోఫీలో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా 8 వికెట్లతో రాణించారు. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తొలి 5 వికెట్లను పడగొట్టిన శుక్లా, మొత్తంగా 20 ఓవర్లలో 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశారు. అతడి దెబ్బకు హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్లో 111 రన్స్కే ఆలౌటైంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టారు.
News November 17, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 7

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (జ.మనస్సు)
39. ఎవరితో సంధి శిథిలమవదు? (జ.సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? (జ.యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (జ.సత్పురుషులు)
42. అన్నోదకాలు వేటి నుంచి ఉద్భవిస్తాయి? (జ.భూమి, ఆకాశములందు)
43.లోకాన్ని కప్పివున్నది ఏది? (జ.అజ్ఞానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (జ.బ్రాహ్మణుడు వచ్చినప్పుడు) <<-se>>#YakshaPrashnalu<<>>
News November 17, 2025
చిన్న బ్యాంకుల విలీనానికి కేంద్రం యోచన

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 12 ఉండగా 6 లేదా 7కు తగ్గించాలని నిర్ణయించినట్లు ‘ఇన్ఫార్మిస్ట్’ రిపోర్టు పేర్కొంది. చిన్న బ్యాంకులను SBI, PNBలతో అనుసంధానించడం లేదంటే నేరుగా విలీనం చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. విలీనంతో వాటిని పెద్ద సంస్థలుగా మార్చడం వల్ల స్థిర ప్రణాళికతో లాభాలు ఆర్జించొచ్చని భావిస్తున్నట్లు నివేదించింది.


