News October 8, 2024
వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది: టీడీపీ

AP: రూ.23 కోట్ల అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల ప్రచారంపై రెవెన్యూ శాఖ స్పందించింది. రూ.23 లక్షలను రూ.23 కోట్లుగా ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఎన్టీఆర్ జిల్లాలో వరదల తక్షణ సాయంగా రూ.139.75 కోట్ల అంచనా వేశాం. రూ.89 కోట్లు విడుదల చేసి రూ.79 కోట్ల చెల్లింపులు చేశాం. మరో రూ.10 కోట్ల నిధులు ఇంకా అందుబాటులో ఉన్నాయి. వరద సాయంపై ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు’ అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Similar News
News March 16, 2026
నేడు అమరావతిలో ‘అమరజీవి’ విగ్రహావిష్కరణ

AP: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నేడు. 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా అమరావతిలోని తుళ్లూరులో 58 అడుగుల విగ్రహాన్ని CM చంద్రబాబు నేడు ఆవిష్కరించనున్నారు. ₹150 కోట్ల అంచనా వ్యయంతో 6.8 ఎకరాల్లో చేపట్టిన స్మృతి వనం తొలి దశ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తారు.
News March 16, 2026
‘బాబ్ ఎల్-మండేబ్’నూ మూసేస్తే ప్రత్యామ్నాయమిదే

హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటుండగా దానికి మద్దతుగా <<19387645>>‘బాబ్ ఎల్-మండేబ్’<<>> జలసంధినీ మూసివేస్తామని యెమెన్లోని హౌతీ గ్రూప్ హెచ్చరించింది. ఈ మార్గంలో యూరప్ నుంచి ఆసియాకు సరకు రవాణాకు 20-25 రోజుల సమయం పడుతోంది. ఇది బందయితే ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా చుట్టూ తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ద్వారా రవాణాకు 30-40 రోజుల టైమ్ పడుతుంది. దీనివల్ల 30% గ్లోబల్ ట్రేడ్పై ప్రభావం పడుతుంది.
News March 16, 2026
నందీశ్వరుడు శివుడి వైపే ఎందుకు చూస్తాడు?

శివాలయాల్లో నంది శివుడి వైపే చూస్తుంటాడు. ఇది ఏకాగ్రత, భక్తికి సంకేతం. ఆయన శివుడికి అత్యంత సన్నిహితుడైన ద్వారపాలకుడు. మనసులోని ఆలోచనలు అటు ఇటు తిరగకుండా ఎప్పుడూ దైవచింతనలోనే ఉండాలని నంది స్థితి మనకు బోధిస్తుంది. భక్తుల కోరికలను విన్నవిస్తూ, వారిని శివదర్శనానికి సిద్ధం చేసేందుకు ఆయన శివుడి వైపే చూస్తూ ఉంటారు. ఆయన చెవిలో కోరికలు చెబితే వాటిని ఆయన నేరుగా శివుడికి చేరవేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


