News June 4, 2024

అరకు ఎంపీ స్థానంలో YCP ఆధిక్యం

image

AP: అరకు ఎంపీ స్థానానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి తనుజారాణి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో కూటమి అభ్యర్థి గీతకు 2,566 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి తనూజ రాణికి 3,823 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి 1,357 ఓట్లు ఆధిక్యంతో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అప్పలనరస 866 ఓట్లతో తృతీయ స్థానంలో ఉన్నారు.

Similar News

News September 9, 2025

నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక

image

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇవాళ జరగనుంది. ఓటింగ్ ఉ.10 గంటలకు ప్రారంభమై సా.5 గంటలకు ముగుస్తుంది. సా.6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌, ప్రతిపక్ష కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. లోక్‌సభ, రాజ్య సభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా, 394 ఓట్లు వచ్చిన వారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతారు. NDA ఆ మార్క్ కంటే ఎక్కువ మంది సభ్యుల్ని (422) కలిగి ఉండటం గమనార్హం.

News September 9, 2025

EHS పాలసీ విధి విధానాలు త్వరలో ఖరారు: సీఎస్

image

TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కవర్ అయ్యేలా ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS) విధానాన్ని రూపొందించాలని అధికారులను CS కె.రామకృష్ణారావు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నమూనాలను, బీమా కంపెనీ పాలసీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలన్నారు. దీని ద్వారా 7,14,322 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారని, ఏడాదికి సుమారు ₹1,300Cr ఖర్చవుతుందని అంచనా వేశారు.

News September 9, 2025

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే..

image

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీటితో పాటు కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్ వంటి పానీయాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ‘కొబ్బరి నీళ్లలోని పొటాషియం, ఎలక్ట్రోలైట్లు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. బార్లీ వాటర్ కిడ్నీ స్టోన్స్‌ను నివారిస్తుంది. గ్రీన్ టీ, క్రాన్బెర్రీ జ్యూస్ కిడ్నీలకు మేలు చేస్తాయి’ అని చెబుతున్నారు.