News July 2, 2024
రికవరీ చట్టంతో వైసీపీ నేతల అక్రమార్జనను రాబట్టాలి: యనమల

AP: గత ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆ నష్టాన్ని అధిగమించేందుకు సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. వైసీపీ నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి రాబట్టాలని కోరారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను సూచించారు.
Similar News
News September 17, 2025
MLC తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

TG: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. MLC చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’(TRP) పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో పార్టీ ఆవిర్భవించినట్లు మల్లన్న తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందని వెల్లడించారు.
News September 17, 2025
ICC ర్యాంకింగ్స్.. టీమ్ ఇండియా హవా

ICC తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా సత్తా చాటింది. వన్డే, T20 ఫార్మాట్లలో నంబర్వన్గా నిలిచింది. No.1 వన్డే బ్యాటర్గా గిల్, No.1 T20 బ్యాటర్గా అభిషేక్, No.1 టెస్ట్ బౌలర్గా బుమ్రా, No.1 T20 బౌలర్గా వరుణ్ చక్రవర్తి, No.1 టెస్ట్ ఆల్రౌండర్గా జడేజా, No.1 టీ20 ఆల్రౌండర్గా హార్దిక్ నిలిచారు. అటు స్మృతి మంధాన ఉమెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలి స్థానానికి చేరారు.
News September 17, 2025
ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్.. APPLY

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్షిప్లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31 వరకు <