News July 2, 2024
రికవరీ చట్టంతో వైసీపీ నేతల అక్రమార్జనను రాబట్టాలి: యనమల

AP: గత ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆ నష్టాన్ని అధిగమించేందుకు సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. వైసీపీ నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి రాబట్టాలని కోరారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను సూచించారు.
Similar News
News October 24, 2025
పాదాల పగుళ్లు తగ్గాలంటే..

కొందరికి సీజన్తో సంబంధం లేకుండా పాదాల పగుళ్లు ఇబ్బంది పెడతాయి. వీటికి ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. రోజూ పాదాలకు నూనె, మాయిశ్చరైజర్, తేనె, కలబంద వంటివి రాస్తుండాలి. అలాగే నిమ్మరసం, ఆలివ్ఆయిల్, బ్రౌన్ షుగర్ పేస్ట్ కలిపి పాదాలకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత మసాజ్ చేస్తూ క్లీన్ చేయాలి. పాదాలు ఆరాక మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా తరచూ చేస్తే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
News October 24, 2025
రేపే నాగుల చవితి.. శుభ ముహూర్తం ఏదంటే?

కార్తీక శుద్ధ చతుర్థి సందర్భంగా రేపు నాగుల చవితి జరుపుకొంటారు. చవితి తిథి రేపు 1:19AM నుంచి ఎల్లుండి 3:48AM వరకు ఉంటుంది. నాగ దేవతల పూజకు శుభ ముహూర్తం రేపు ఉదయం 8:59 గంటల నుంచి 10:25 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ శుభ సమయంలో పుట్టలో పాలు పోసి, భక్తి శ్రద్ధలతో నాగ దేవతలను ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయంటున్నారు. ప్రకృతి, జంతువుల పట్ల గౌరవానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకొంటారు.
News October 24, 2025
ఆస్ట్రేలియా టీ20 జట్టులో భారీ మార్పులు

భారత్తో ఈనెల 29 నుంచి NOV 8 వరకు జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ ఆఖరి 3 మ్యాచ్లు ఆడనున్నారు. ENGతో యాషెస్ సిరీస్ నేపథ్యంలో హేజిల్వుడ్ 2, సీన్ అబాట్ 3 మ్యాచ్లకు మాత్రమే ఎంపికయ్యారు. వీరి స్థానాల్ని బియర్డ్మ్యాన్, డ్వార్షూస్ భర్తీ చేయనున్నారు. కీపర్ జోష్ ఫిలిప్ అన్ని మ్యాచ్లూ ఆడనున్నారు.


