News July 2, 2024

రికవరీ చట్టంతో వైసీపీ నేతల అక్రమార్జనను రాబట్టాలి: యనమల

image

AP: గత ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆ నష్టాన్ని అధిగమించేందుకు సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. వైసీపీ నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి రాబట్టాలని కోరారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను సూచించారు.

Similar News

News December 6, 2025

జీఎస్టీ&సెంట్రల్ ఎక్సైజ్ చెన్నైలో ఉద్యోగాలు

image

జీఎస్టీ కమిషనర్&సెంట్రల్ ఎక్సైజ్, చెన్నై స్పోర్ట్స్ కోటాలో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవల్దార్, MTS పోస్టులు ఉన్నాయి. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో పతకాలు సాధించిన వారు డిసెంబర్ 18 నుంచి జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://gstchennai.gov.in/

News December 6, 2025

‘రైట్ టు డిస్‌కనెక్ట్’.. ఏ దేశాల్లో అమల్లో ఉంది?

image

పని వేళలు పూర్తయ్యాక ఉద్యోగులు ఆఫీస్ కాల్స్‌ను <<18487853>>డిస్ కనెక్ట్<<>> చేసే హక్కును 2017లో ఫ్రాన్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, బెల్జియం దేశాలు ఈ తరహా చట్టాలను తీసుకొచ్చాయి. ఇది ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, వారి శ్రేయస్సు, ప్రొడక్టివిటీకి ముఖ్యమని పేర్కొన్నాయి. ఇండియాలోనూ 2018, 2025లో ఇలాంటి ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ చట్టరూపం దాల్చలేదు.

News December 6, 2025

TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

image

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.