News June 6, 2024

గవర్నర్‌ను కలిసిన YCP నేతలు

image

AP: గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. కౌంటింగ్ తర్వాత వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని, జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News November 13, 2025

ఇతిహాసాలు క్విజ్ – 65 సమాధానాలు

image

ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
శంతనుడు, గంగాదేవి ఎనిమిదవ కుమారుడు ‘దేవవత్రుడు’. హస్తినాపురానికి రాజుగా కాబోనని, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భయంకరమైన ప్రతిజ్ఞ చేసినందుకు ఆయనకు ‘భీష్ముడు’ అనే పేరు వచ్చింది. శంతనుడి సంతోషం కోసం, తన తండ్రి పెళ్లి చేసుకొనే సత్యవతి పుత్రులకు రాజ్యాధికారం దక్కాలని భీష్ముడు ఈ ప్రతిజ్ఞ చేశాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 13, 2025

కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున

image

TG: మంత్రి కొండా సురేఖ <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడంతో సీనియర్ హీరో నాగార్జున పరువునష్టం కేసును విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో నాంపల్లి కోర్టు ఆ కేసును కొట్టివేసింది. కాగా నిన్న కొండా సురేఖ నాగార్జునకు ట్విటర్ (X) వేదికగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం రేపాయి. దీంతో నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు.

News November 13, 2025

ఈ టిప్స్‌తో ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్ సేఫ్‌

image

ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు 20-80% ఛార్జింగ్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. 100% ఛార్జ్ చేసిన ప్రతిసారీ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. 25% కంటే తక్కువకు చేరినప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. కంపెనీ లేదా సర్టిఫైడ్ ఛార్జర్లనే వాడాలి. అధిక చల్లదనం, వేడి ప్రాంతాల్లో, బెడ్, బ్లాంకెట్‌పై ఉంచి ల్యాప్‌టాప్ వాడొద్దు. బ్రైట్‌నెస్, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ బ్యాటరీ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.