News March 18, 2024

వైసీపీ మేనిఫెస్టో ప్రకటన వాయిదా!

image

AP: ఈనెల 20న జరగాల్సిన వైసీపీ మేనిఫెస్టో ప్రకటన కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ‘జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం’ పేరుతో మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రైతులు, కార్మికులు, వృద్ధులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News September 7, 2025

చదువుకు పర్యాయపదం చంద్రబాబు: టీడీపీ

image

AP: మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు TDP దీటుగా బదులిచ్చింది. ‘30 ఇంజినీరింగ్ కాలేజీలు లేనిచోట 300కు పైగా నెలకొల్పింది చంద్రబాబు. DSCలతో 2 లక్షల మంది టీచర్లను నియమించారు. ISB, IIIT, NAC, NALSAR, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకొచ్చారు. 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తీసుకొచ్చారు. జగన్ తెచ్చింది 950 సీట్లే. చదువుకు CBN పర్యాయపదం’ అని Xలో పేర్కొంది.

News September 7, 2025

సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ

image

TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కడియం శ్రీహరి మినహా మిగతావారు హాజరైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తాను BRSలోనే ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ పలువురు MLAలకు నోటీసులివ్వగా ఒకరిద్దరు ఆయనకు సమాధానమిచ్చినట్లు సమాచారం.

News September 7, 2025

ఫోన్ ఛార్జర్‌ను సాకెట్‌లో వదిలేస్తున్నారా?

image

చాలామంది ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ ఫుల్ కాగానే ఛార్జర్‌ను అలాగే సాకెట్‌లో వదిలేస్తారు. కానీ ఇలా చేయొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇలా చేస్తే వోల్టేజ్ పెరిగినప్పుడు ఛార్జర్ పేలిపోవచ్చు. అంతర్గత భాగాలు వేడెక్కి అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. స్విచ్ ఆఫ్ చేసినా ఛార్జర్ కొంత మేర విద్యుత్ ఉపయోగిస్తూనే ఉంటుంది. దీంతో విద్యుత్ వృథా అవుతుంది. అన్‌ప్లగ్ చేయడం ఉత్తమం’ అని చెబుతున్నారు.