News September 12, 2024

వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు: గంటా శ్రీనివాస్

image

AP: వరద బాధితుల్ని ఆదుకోకుండా జైలులో ఉన్న పార్టీ నేతలను జగన్ పరామర్శిస్తున్నారని MLA గంటా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ‘బాధితులకు GOVT అందిస్తున్న సాయంపై ఆరోపణలు చేస్తే చరిత్రహీనులుగా మారుతారు. ఎన్నికల్లో YCPని ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌లో మార్పు రాలేదు. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చూస్తున్నారు. కూటమి సర్కార్ గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారు’ అని అన్నారు.

Similar News

News November 23, 2025

ADB: బీసీలకు 22 నుంచి 26% రిజర్వేషన్లు..!

image

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు వస్తాయని ఆశించిన బీసీలకు భంగపాటు తప్పలేదు. 50% ఉంచకుండా రిజర్వేషన్లు కల్పించాలంటే బీసీలకు 22 నుంచి 26% స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఈరోజు సాయంత్రం వరకు పూర్తవనుంది. జిల్లాలో 20 మండలాలు ఉండగా బీసీలకు 5 + జడ్పీటీసీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

News November 23, 2025

బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>జేసీ<<>> బోస్ ఇన్‌స్టిట్యూట్‌ 13 డఫ్ట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jcbose.ac.in/

News November 23, 2025

శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

image

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>