News February 12, 2025

పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు

image

AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్న అనారోగ్య సమస్యలతో సీఎం చంద్రబాబు కాల్‌కు రెస్పాండ్ అవ్వని పవన్ ఇవాళ తీర్థయాత్రలకు వెళ్లడం కూటమి ప్రభుత్వానికి ఆనందం తెప్పిస్తోందని సెటైర్ వేశారు. బడ్జెట్‌కు ముందు కీలకమైన సమావేశాలకూ PK డుమ్మా కొట్టారని విమర్శించారు. కాగా దక్షిణాది ఆలయాల పర్యటనలో ఉన్న పవన్ ఇవాళ ఉదయం కేరళలోని పలు దేవాలయాలను సందర్శించారు.

Similar News

News October 29, 2025

క్రెడిట్ కార్డులతో రికార్డు స్థాయి కొనుగోళ్లు

image

సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డులతో రికార్డు స్థాయి (₹2.17 లక్షల కోట్లు) కొనుగోళ్లు జరిగాయి. ఆగస్టుతో పోలిస్తే ఇది 14% అధికం. ఫెస్టివల్ సీజన్, బ్యాంకులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల డిస్కౌంట్లు, ఆఫర్లతో పాటు GST రేట్లలో కోత ఇందుకు కారణాలుగా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025 మార్చిలో ₹2.015 ట్రిలియన్, ఆగస్టులో ₹1.91T కొనుగోళ్లు నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇది ₹1.76లక్షల కోట్లుగా ఉంది.

News October 29, 2025

సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిలా ఎలా మారాడు?

image

పూర్వకాలంలో సంవత్సర ప్రారంభాన్ని కృత్తికా(కార్తీక) నక్షత్రంతో లెక్కించేవారు. ఆ నక్షత్రంతో సుబ్రహ్మణ్య స్వామికి ఓ గొప్ప అనుబంధం ఉంది. ఈ నక్షత్రం ఆరు తారల సమూహం. సుబ్రహ్మణ్య స్వామిని కూడా షణ్ముఖుడు అని అంటారు. అంటే ఆరు తలలు గలవాడు అని అర్థం. ఆకాశంలో ఉన్న ఈ ఆరు కృత్తికా నక్షత్రాలే తల్లి రూపంలో వచ్చి ఆయనకు పాలు ఇచ్చాయట. అందువల్లే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

News October 29, 2025

నేడు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

image

AP: తుఫాన్ వల్ల పత్తి రైతులు నష్టపోకూడదని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం కానున్నాయి. క్వింటాలుకు ₹8,110 మద్దతు ధర ఖరారు చేశారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను CM యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలి. తర్వాత ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి.