News December 6, 2024
ఈనెల 13 నుంచి వైసీపీ ఉద్యమబాట

AP: ఈనెల 13 నుంచి వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. 13న రైతు సమస్యలపై, ఈనెల 27న కరెంటు ఛార్జీల మోతపై, 2025 జనవరి 3న విద్యార్థులకు బాసటగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపింది. వీటితో పాటు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు పేర్కొంది. సంక్రాంతి నుంచి వైఎస్ జగన్ జనంలోకి వస్తారని తెలిపింది.
Similar News
News November 20, 2025
HYD: చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం

కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి గుండ్లపోచంపల్లిలో చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెయింటర్లు నూర్ ఆలం(36), అశ్రఫ్ అలీ (27) ఇంటికి వెళ్లే సమయంలో చలిమంట వేసుకోగా వారి వద్ద మిగిలిన టర్పెంట్ ఆయిల్ని మంటలో వేశారు. దీంతో ఒక్కసారిగా మండి ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని గాంధీ హాస్పిటల్కి తరలించారు. వీరిద్దరూ బిహార్కు చెందిన వారు.
News November 20, 2025
HYD: చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం

కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి గుండ్లపోచంపల్లిలో చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెయింటర్లు నూర్ ఆలం(36), అశ్రఫ్ అలీ (27) ఇంటికి వెళ్లే సమయంలో చలిమంట వేసుకోగా వారి వద్ద మిగిలిన టర్పెంట్ ఆయిల్ని మంటలో వేశారు. దీంతో ఒక్కసారిగా మండి ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని గాంధీ హాస్పిటల్కి తరలించారు. వీరిద్దరూ బిహార్కు చెందిన వారు.
News November 20, 2025
శబరిమల: చిన్నారుల ట్రాకింగ్కు ‘Vi బ్యాండ్’

శబరిమలలో చిన్నారులు తప్పిపోకుండా వొడాఫోన్-ఐడియా(Vi)తో కలిసి కేరళ పోలీసులు ‘సురక్ష బ్యాండ్’లను తీసుకొచ్చారు. చిన్న పిల్లలతో శబరిమల వెళ్లే భక్తులు Vi సెక్యూరిటీ కియోస్కుల వద్ద, కేరళలోని అన్ని Vi స్టోర్లలో ఈ సురక్ష బ్యాండ్లను పొందొచ్చు. ఆన్లైన్లో కూడా వీటికోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాండ్కు ఒక స్పెషల్ డిజిటల్ కోడ్ ఉంటుంది. ఒకవేళ పిల్లలు తప్పిపోతే వారిని దీని సాయంతో ట్రాక్ చేయొచ్చు.


