News July 22, 2024

అమిత్ షాను కలిసిన వైసీపీ ఎంపీ

image

AP: పార్లమెంట్ ఛాంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ఈ విషయాన్ని X ద్వారా ఎంపీ వెల్లడించారు. గవర్నెన్స్, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

Similar News

News November 26, 2025

రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: CM

image

AP: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు న్యాయం జరగాలని, సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని CRDA సమీక్షలో సూచించారు. మరోవైపు రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని, నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు.

News November 26, 2025

భట్టి కుమారుడి ఎంగేజ్‌మెంట్.. హాజరైన సీఎం

image

TG: హైదరాబాద్‌లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.

News November 26, 2025

RRR కేసు.. సునీల్ కుమార్‌కు సిట్ నోటీసులు

image

AP: రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో IPS అధికారి, సీఐడీ మాజీ చీఫ్ PV సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. DEC 4న జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని RRR 2024లో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్‌తో పాటు మాజీ సీఎం జగన్, మరికొందరిని నిందితులుగా చేర్చారు.