News October 29, 2024

విద్యుత్ ఛార్జీల పెంపునకు వైసీపీ విధానాలే కారణం: అనగాని

image

AP: వైసీపీ నాయకులు కేసులు, బెయిల్ కోసం ఢిల్లీ వెళ్లేవారని, సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ‘రీసర్వే పూర్తయ్యాక జిల్లాల పునర్విభజనపై దృష్టిసారిస్తాం. పార్టీలో అర్హులైన వారికి త్వరలో నామినేటెడ్ పదవులు వస్తాయి’ అని తెలిపారు.

Similar News

News January 25, 2026

తగ్గనున్న BMW, ఫ్రెంచ్ వైన్ ధరలు?

image

భారత్-EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న జరిగే India-EU సమ్మిట్‌లో ఒప్పందం ఖరారు లాంఛనంగా కనిపిస్తోంది. అదే జరిగితే BMW, ఫోక్స్‌వ్యాగన్ వంటి ప్రీమియం కార్లు, ఫ్రెంచ్ వైన్ సహా అనేక ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇండియా నుంచి టెక్స్‌టైల్స్, నగలు, కెమికల్స్, ఫార్మా వంటి ఎగుమతులు పెరుగుతాయి. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో EU మార్కెట్ భారత్‌కు కీలకం కానుంది.

News January 25, 2026

T20 WC.. ఏ గ్రూపులో ఏ జట్లు ఉన్నాయంటే?

image

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్ల గ్రూపులను ICC ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ గ్రూప్-Aలో ఉన్నాయి. బంగ్లాదేశ్ WC నుంచి తప్పుకోవడంతో గ్రూప్-Cలో దాని స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చారు. పై ఫొటోలో ఏ గ్రూపుల్లో ఏ జట్లు ఉన్నాయో చూడొచ్చు.

News January 25, 2026

ఆగాకర సాగు.. ఇలా నాటితే ఎక్కువ ప్రయోజనం

image

ఆగాకరను విత్తనం, దుంపలు, తీగ కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. 2-3 సంవత్సరాల వయసుగల దుంపలు నాటుటకు అనుకూలం. తీగ కత్తిరింపుల ద్వారా అయితే 2-3 నెలల వయసున్న తీగ కత్తిరింపులను ఎంచుకోవాలి. విత్తనం ద్వారా నాటుకోవాలంటే గుంతకు 4-5 విత్తనాలు నాటుకోవాలి. ఇవి పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసి గుంతకు 2-3 ఆరోగ్యవంతమైన ఆడ మొక్కలను ఉంచాలి. దుంపల ద్వారా నాటడం రైతులకు శ్రేయస్కరం.