News February 25, 2025

వీసీలకు బెదిరింపులంటూ వైసీపీ ‘ట్రూత్ బాంబ్’ పోస్ట్

image

AP: వీసీలను బెదిరించి రాజీనామా చేయించారని మండలిలో YCP నేతలు ఆరోపించారు. ఆధారాలుంటే చూపాలని మంత్రి లోకేశ్ సవాల్ విసరగా YCP స్పందించింది. ఛైర్మన్ మౌఖికంగా ఆదేశించడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు సింహపురి వర్సిటీ VC సుందరవల్లి రాసిన లేఖను Xలో పోస్టు చేసింది. ‘ఇదిగో ఆధారాలు బయటపెట్టాం. నిజాయితీ ఉంటే VCల రిజైన్‌పై న్యాయబద్ధ విచారణ చేయించాలి. లేదంటే లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది.

Similar News

News November 13, 2025

పరిస్థితి తీవ్రంగా ఉంది.. మాస్కులు సరిపోవు: SC

image

ఢిల్లీ గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాస్కులు సరిపోవని చెప్పింది. లాయర్లు వర్చువల్‌గా విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈ కాలుష్యం వల్ల శాశ్వత నష్టం జరుగుతుందని చెప్పింది. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది.

News November 13, 2025

కనకాంబరం పూల సేకరణకు ఇదే అనువైన సమయం

image

కనకాంబరం సాగు తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. ఈ మొక్కలు నాటిన 2 నుంచి 3 నెలలకు పూత ప్రారంభమై, ఏడాది పొడవునా పూలు పూస్తాయి. జూన్ నుంచి జనవరి వరకు దిగుబడి ఎక్కువగా, వర్షాకాలంలో దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. కనకాంబరం పూలను సరైన సమయంలో సేకరిస్తే అవి తాజాగా ఉండి మంచి ధర వస్తుంది. కనకాంబరం పూర్తిగా విచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. కాబట్టి రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పూలు కోయాలి.

News November 13, 2025

షమీపై లక్నో, ఢిల్లీ ఆసక్తి

image

SRH స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని దక్కించుకునేందుకు లక్నో, ఢిల్లీ ఆసక్తిగా ఉన్నాయని Cricbuzz తెలిపింది. నవంబర్ 15తో రిటెన్షన్ డెడ్‌లైన్ ముగియనుండగా SRH షమీని వదులుకోవచ్చని పేర్కొంది. గత వేలంలో హైదరాబాద్ రూ.10 కోట్లకు షమీని కొనుగోలు చేసింది. కానీ అతడు కేవలం 6 వికెట్లు మాత్రమే తీశారు. గత వేలంలో షమీ కోసం లక్నో రూ.8.5 కోట్ల వరకు వెళ్లింది. అటు ఢిల్లీ యాజమాన్యంలో భాగమైన గంగూలీ షమీపై ప్రశంసలు కురిపించారు.