News September 9, 2025

యూరియా కొరతపై నేడు వైసీపీ నిరసనలు

image

AP: రాష్ట్రంలో యూరియా కొరతపై YCP ‘అన్నదాత పోరు’ పేరిట ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. రైతులు, రైతు సంఘాలతో కలిసి అన్ని RDO కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాలని పార్టీ అధ్యక్షుడు జగన్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పంటలకు ఉచిత బీమాను పునరుద్ధరించాలని, వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని అధికారులకు YCP నేతలు వినతి పత్రాలు అందించనున్నారు.

Similar News

News September 9, 2025

భరించలేకపోతున్నా.. నాకింత విషం ఇవ్వండి: దర్శన్

image

కొన్ని రోజులుగా జైలులో సూర్యరశ్మి తాకట్లేదని కన్నడ హీరో దర్శన్ కోర్టుకు తెలిపారు. తాను ఫంగస్‌తో బాధపడుతున్నానని, తన దుస్తులు స్మెల్ వస్తున్నాయని వాపోయారు. బయటకు వెళ్లేందుకు అనుమతివ్వాలని లేదా విషం ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణను సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని గత నెలలో <<17401764>>దర్శన్<<>> బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

News September 9, 2025

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: అనంతపురం పట్టణంలో రేపు ‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ సభకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో రద్దీ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చినట్లు తెలిపారు. రేపు హాలిడే ఇస్తున్న కారణంగా రెండో శనివారమైన ఈ నెల 13న పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేస్తాయన్నారు.

News September 9, 2025

హిమాలయ జ్వాలకు 3 కారణాలు.. 3 రూపాలు!

image

1.హిమాలయ దేశం నేపాల్లో‌ నెలకొన్న అవినీతి, దానికి పరిష్కారం లేకపోవడంపై ఆ దేశ Zen Z(యువత) ‘అసహనం’తో ఉంది. 2.కొందరు నేతలు కుటుంబాలతో విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడిపే వీడియోలు ఇటీవల వైరలవగా ప్రజా ధనంతో పాలకుల జల్సాలా? అనే ‘ఆవేదన’ వ్యక్తమైంది. 3.దేశంలో రిజిస్టర్ కాలేదని SM సైట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో తమ గొంతును పాలకులు అణిచివేశారనే ‘ఆగ్రహం’తో నిరసన జ్వాల నియంత్రణ తప్పి కార్చిచ్చులా దహిస్తోంది.