News April 9, 2025
SI సుధాకర్పై వైసీపీ శ్రేణుల ఆగ్రహం

AP: మాజీ సీఎం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన <<16038250>>రామగిరి SI సుధాకర్పై<<>> YCP శ్రేణులు ఫైరవుతున్నాయి. ఆయన టీడీపీ కోసమే పనిచేస్తున్నారనే దానికి ఈ పొలిటికల్ విమర్శలే నిదర్శనమని పేర్కొంటున్నాయి. టీడీపీ నుంచి గుంతకల్ అసెంబ్లీ సీటుకు పోటీ అంటూ గతంలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను, లోకేశ్, అచ్చెన్న, సత్యకుమార్ తదితర మంత్రులతో ఆయన దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నాయి. ఇదేనా నీ నిజాయితీ అని ప్రశ్నిస్తున్నాయి.
Similar News
News December 24, 2025
కలెక్షన్ల సునామీ.. రూ.1,000 కోట్ల దిశగా ‘ధురంధర్’

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో రూ.925 కోట్ల(గ్రాస్)ను సాధించింది. రెండుమూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మార్క్ చేరనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా యానిమల్(రూ.917 కోట్లు)ను బీట్ చేసి 9వ స్థానానికి చేరింది. ఇదే జోరు కొనసాగితే కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి రికార్డులు బ్రేకవడం గ్యారంటీ.
News December 24, 2025
కన్నప్రేమ నేర్పిన నాయకత్వం: సత్య నాదెళ్ల విజయ రహస్యం

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల నాయకత్వ శైలి మారడానికి ఆయన పిల్లలే ప్రధాన కారణం. పుట్టుకతోనే ప్రత్యేక అవసరాలున్న తన పిల్లలను చూశాక లోకాన్ని చూసే కోణం మారిందన్నారు ఆయన ఓ సందర్భంలో. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం నాయకుడికి ఉండాలని గ్రహించారు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నవారికి సాంకేతికత అందాలనే లక్ష్యంతో పనిచేశారు. తన పిల్లల వల్ల కలిగిన ఈ అనుభవాలే ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాయి.
News December 24, 2025
యాసంగి అవసరాలకు యూరియా సిద్ధం: మంత్రి తుమ్మల

తెలంగాణలోని రబీ సీజన్ అవసరాల కోసం ఇప్పటికే 5 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే జనవరి, ఫిబ్రవరి అవసరాలకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్, జనగామ, మహబూబ్నగర్, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరియా యాప్ అమలు చేస్తున్నామని, 2 రోజుల్లోనే 19,695 మంది రైతులు 60,510 యూరియా బస్తాలను కొనుగోలు చేశారని తెలిపారు.


