News January 24, 2025
తీవ్ర నిరాశలో వైసీపీ శ్రేణులు

YCP అధినేత జగన్ వ్యూహాల వెనుక విజయసాయిరెడ్డిది కీలకపాత్ర. 2004 నుంచి జగన్ వెంట నడుస్తున్నారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్తో పాటు జైలు జీవితం గడిపారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి తెర వెనుక వ్యూహరచన, తెర ముందు రాజకీయ విమర్శలతో పెద్దదిక్కుగా మారారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు నడిపారు. రేపు VSR రాజీనామా చేయనుండటంతో జగన్ ఒంటరవుతారని YCP ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.
Similar News
News December 9, 2025
ఈ టైమ్లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it
News December 9, 2025
ఇతిహాసాలు క్విజ్ – 91 సమాధానం

ఈరోజు ప్రశ్న: శ్రీరాముడి కవల కుమారులే లవకుశులు. మరి రాముడు తన పుత్రులతో యుద్ధమెందుకు చేశాడు?
సమాధానం: శ్రీరాముడు నిర్వహించిన అశ్వమేధ యాగ గుర్రాన్ని వాల్మీకి ఆశ్రమంలో ఉన్న లవకుశులు బంధించారు. అది వారి తండ్రి అశ్వమని వాళ్లకు తెలియదు. అయితే, రాజధర్మాన్ని పాటించాల్సి వచ్చిన రాముడు, గుర్రాన్ని విడిపించడానికి తన సైన్యాన్ని పంపగా, ఆ ఘట్టం చివరకు తండ్రీకొడుకుల మధ్య యుద్ధానికి దారితీసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 9, 2025
భూసమస్యలకు ఇక JCలదే బాధ్యత: అనగాని

AP: జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘గత పాలకుల పాపాలను కడిగేందుకు కృషి చేయడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాం. అన్ని జిల్లాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే జాయింట్ కలెక్టర్లు పనిచేయాలని CM స్పష్టం చేశారు. JCలు లేని జిల్లాలకు వెంటనే నియమించాలన్నారు. ఇకపై భూసమస్యలన్నింటికీ JCలదే బాధ్యత’ అని తెలిపారు.


