News June 25, 2024
వైసీపీ పాలన పీడకల: చంద్రబాబు

AP: గత ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్రానికి పీడకల వంటిదని, అలాంటి పాలనను తాను ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ తప్పూ చేయకున్నా 30 మంది టీడీపీ కార్యకర్తలను జైలులో పెట్టారని కుప్పం బహిరంగసభలో దుయ్యబట్టారు. కుప్పంలో రౌడీయిజం చేస్తే ఉపేక్షించబోమని, వారికి ఇదే చివరి రోజని హెచ్చరించారు. మంచి వాతావరణ పరిస్థితులు ఉండే ఈ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
Similar News
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>


