News March 20, 2024
వైసీపీని ఇంటికి సాగనంపాలి: చంద్రబాబు
AP: రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి సాగనంపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు పిలుపునిచ్చారు. దీని కోసం ప్రజలు ముందడుగు వేయాలన్నారు. జనం నమ్మకాన్ని జగన్ కోల్పోయారని.. ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నారని విమర్శించారు. సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలని కోరారు.
Similar News
News October 1, 2024
లడ్డూ వివాదం.. నేతలకు టీడీపీ కీలక ఆదేశాలు
AP: తిరుమల లడ్డూ అంశంలో CM చంద్రబాబు, ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ నేతలకు TDP కీలక ఆదేశాలిచ్చింది. కోర్టు, న్యాయమూర్తులపై విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలే ప్రజలకు చెప్పాలని కోరింది. చంద్రబాబు శ్రీవారి భక్తుడని, ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం ప్రజలకు చెప్పారని తెలిపింది.
News October 1, 2024
DSC ఫలితాల్లో తండ్రీకొడుకులకు ర్యాంకులు
TG: డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట జిల్లా రాకొండకు చెందిన గోపాల్, అతని కుమారుడు భానుప్రకాశ్ ర్యాంకులు సాధించారు. తెలుగు పండిట్గా జిల్లాలో గోపాల్కు ఫస్ట్ ర్యాంక్ రాగా, మ్యాథ్స్ సబ్జెక్టులో భాను ప్రకాశ్కు 9వ ర్యాంక్ వచ్చింది. గోపాల్ భార్య విజయలక్ష్మి ఇదివరకే తెలుగు పండిట్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల క్రితం వారి రెండో కుమారుడు చంద్రకాంత్ కూడా గవర్నమెంట్ జాబ్కు(ఏఈఈ) సెలక్ట్ అయ్యాడు.
News October 1, 2024
ఏపీలో ఖరీఫ్ సాగు 84 శాతమే
AP: ఖరీఫ్ సీజన్లో సాగు లక్ష్యం 32.50లక్షల హెక్టార్లు కాగా, 27.44లక్షల హెక్టార్లలోనే(84 శాతం) పంటలు సాగయ్యాయి. వరి సాగు 10%, పత్తి 33%, వేరుశనగ 48% తగ్గింది. పలు చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో వర్షాభావం, సకాలంలో వరుణుడు కరుణించకపోవడం వల్ల సాగు లక్ష్యం నెరవేరలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జొన్న, కొర్ర, సజ్జ, కంది, మినుము, పెసర, సన్ఫ్లవర్ వంటి పంటల సాగు ఆశాజనకంగా ఉందన్నారు.