News July 22, 2024

వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి ఏపీకి వస్తుండగా కుప్పం సమీపంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా తన వ్యాఖ్యలతో నాగార్జున వివాదాల్లో ఉన్నారు. చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై టీడీపీ ఫిర్యాదు చేసింది.

Similar News

News December 1, 2025

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ స్నేహ

image

హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ధర్మసాగర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లు, ట్రక్కుల రవాణా, ఓపీఎంఎస్ ఎంట్రీల వివరాలను సమీక్షించారు. రైతుల సమస్యలు తెలుసుకుని, వారి ఖాతాల్లో డబ్బులు త్వరగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.