News December 26, 2024

రేపు వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళన

image

AP: విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రేపు వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టనుంది.

Similar News

News November 23, 2025

మహిళలు.. మీకు సలాం

image

క్రికెట్ అంటే జెంటిల్‌మెన్ గేమ్ అన్న మాటలను భారత మహిళలు బద్దలు కొడుతున్నారు. కొన్ని రోజుల క్రితం హర్మన్ సేన ICC వన్డే వరల్డ్ కప్ గెలుచుకోగా, తాజాగా అంధుల మహిళల జట్టు తొలి టీ20 <<18367663>>WC<<>>ను నెగ్గింది. దీంతో ఆ జట్టుకు SMలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చూపు లేకపోయినా తమ ఆటతో మరికొందరికి భవిష్యత్తుకు దారి చూపించారని పలువురు పోస్టులు చేస్తున్నారు. టాలెంట్‌ను ప్రోత్సహిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అంటున్నారు.

News November 23, 2025

RBIలో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

image

<>ఆర్బీఐ <<>>5 మెడికల్ కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: rbi.org.in.

News November 23, 2025

వన్డేలకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన టీమ్ ఇండియా

image

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టుకు కొత్త కెప్టెన్‌ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్‌కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.