News August 22, 2024

ప్రమాదంపై వైసీపీ vs టీడీపీ

image

AP: అచ్యుతాపురం పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై టీడీపీ, వైసీపీ విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ ప్రభుత్వంలో తెచ్చిన ప్రమాణాలను అటకెక్కించారని YCP విమర్శించింది. ప్రజల శవాలపై వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ మండిపడింది. వైసీపీ హయాంలో 16 ఘటనలు జరిగి 70 మంది చనిపోయారని, ఇవేనా మీరు తెచ్చిన భద్రతా ప్రమాణాలు అని కౌంటర్ ఇచ్చింది.

Similar News

News December 21, 2025

దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పుల మోత.. 10 మంది మృతి

image

దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జొహన్నెస్‌బర్గ్‌కు సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు వాహనాల్లో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెలలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.

News December 21, 2025

‘ఘోస్ట్’ స్కూల్స్.. టాప్‌లో బెంగాల్, TG!

image

మన దేశంలో 5,149 ప్రభుత్వ పాఠశాలలు ఒక్క స్టూడెంట్ కూడా లేకుండా ‘ఘోస్ట్ స్కూల్స్’గా మారాయి. ఇలాంటి 70% స్కూల్స్ తెలంగాణ, వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. TGలోని అన్ని జిల్లాల్లోనూ జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూల్స్ ఉండటం ఆందోళనకరం. ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు, పట్టణ ప్రాంతాలకు వలస, ప్రభుత్వాల ప్రణాళికా లోపమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లలు లేకపోయినా బడ్జెట్ మాత్రం కేటాయిస్తున్నారు.

News December 21, 2025

కుంభమేళా ‘మోనాలిసా’.. క్రేజ్ తగ్గేదేలే

image

కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే సినిమాల్లో పలు అవకాశాలు దక్కించుకున్న ఆమె షాపింగ్ మాల్స్, హోటల్స్ ఓపెనింగ్స్, పబ్లిక్ ఈవెంట్లకూ గెస్ట్‌గా హాజరవుతున్నారు. తాజాగా HYDలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ‘లైఫ్’ అనే తెలుగు మూవీలోనూ ఇటీవల ఆమెకు నటించే ఛాన్స్ వచ్చింది. షూటింగ్‌ వీడియోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు.