News August 22, 2024

ప్రమాదంపై వైసీపీ vs టీడీపీ

image

AP: అచ్యుతాపురం పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై టీడీపీ, వైసీపీ విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ ప్రభుత్వంలో తెచ్చిన ప్రమాణాలను అటకెక్కించారని YCP విమర్శించింది. ప్రజల శవాలపై వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ మండిపడింది. వైసీపీ హయాంలో 16 ఘటనలు జరిగి 70 మంది చనిపోయారని, ఇవేనా మీరు తెచ్చిన భద్రతా ప్రమాణాలు అని కౌంటర్ ఇచ్చింది.

Similar News

News November 21, 2025

ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో అందరికీ గృహాలు అందించేందుకు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించాలన్నారు. మూడేళ్లలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వచ్చేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు.

News November 21, 2025

PHOTO: ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా భారత మహిళా క్రికెటర్

image

టీమ్ ఇండియా క్రికెట్‌లో ఫిట్‌నెస్ అనగానే మేల్ క్రికెటర్స్ గురించే మాట్లాడతారు. వాళ్లు జిమ్ చేసే ఫొటోలు, వీడియోలు వైరలవుతూ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేసిన భారత మహిళా క్రికెటర్ ఫొటో చూశాక చాలామంది అభిప్రాయం మారినట్లు కనిపిస్తోంది. ఆమె మరెవరో కాదు U-19 T20 వరల్డ్ కప్-2025 విన్నింగ్ కెప్టెన్ నికీ ప్రసాద్. ఆమె ఫిట్‌నెస్ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

News November 21, 2025

నేషనల్ న్యూస్ రౌండప్

image

* జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు సౌతాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
* బిహార్‌లో 27 మంది మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం నితీశ్.. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీకి హోంశాఖ కేటాయింపు
* శబరిమల గోల్డ్ చోరీ కేసు.. బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ అరెస్ట్
* డిసెంబర్ 4న సేలంలో నిర్వహించ తలపెట్టిన TVK విజయ్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ