News January 28, 2025
వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి: చంద్రబాబు

AP: ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరుపై టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జ్లతో CM చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నేతలకు చెప్పారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని పేర్కొన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని సూచించారు.
Similar News
News November 16, 2025
ఇండియా-A ఘన విజయం

రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా-A 9 వికెట్ల తేడాతో గెలిచింది. 133 పరుగుల లక్ష్యాన్ని 28 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రుతురాజ్ (68*) హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ 32, తిలక్ 29* రన్స్ చేశారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్ను ఇండియా-A 2-0తో సొంతం చేసుకుంది. మూడో అనధికార వన్డే ఈ నెల 19న రాజ్కోట్లో జరగనుంది.
News November 16, 2025
TG న్యూస్ రౌండప్

* ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ HYDలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ ఏర్పాటుచేసిన తేనీటి విందుకు CM రేవంత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ హాజరయ్యారు.
* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21న HYDలో భారతీయ కళా మహోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లి సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
* రైతులకు యాసంగి బోనస్ రూ.200 కోట్లను వెంటనే విడుదల చేయాలి: హరీశ్ రావు
News November 16, 2025
RRB PO అడ్మిట్ కార్డులు విడుదల

IBPS RRB PO(Officer Scale-I) ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.ibps.in/లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పాస్వర్డ్తో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నవంబర్ 22, 23 తేదీల్లో జరగనుంది. మెయిన్స్ అడ్మిట్ కార్డులు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య అందుబాటులోకి వస్తాయి. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా 3,928 పోస్టులను భర్తీ చేయనున్నారు.


