News February 3, 2025

వైసీపీ ‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా

image

AP: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని వైసీపీ మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు Xలో ప్రకటన రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది.

Similar News

News March 15, 2026

అటామిక్ క్లాక్స్ చెడిపోతే ఏం జరుగుతుంది?

image

నేవిగేషన్ వ్యవస్థలో అటామిక్ క్లాక్స్(పరమాణు గడియారాలు) కీలకం. భూమిపై ఉన్న మనిషి/ప్రదేశం/ వస్తువు స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ఇవే ఆధారం. ఇవి 15 బిలియన్ ఏళ్లలో ఒక్క సెకను కూడా తప్పు చూపవు. ప్రస్తుతం నావిక్ వ్యవస్థలోని <<19386461>>ఈ క్లాక్<<>> చెడిపోయింది. దీనివల్ల ఏదైనా వస్తువు అసలు స్థానం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చూపుతాయి. నావిక్‌తో అనుసంధానమైన 8,700 రైళ్లకు అంతరాయం ఏర్పడవచ్చు.

News March 15, 2026

ఇలా అయితే SRHకు ఇబ్బందులు తప్పవు: పుజారా

image

SRHలో అభిషేక్, హెడ్, క్లాసెన్ లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నప్పటికీ అనేక లోపాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ పుజారా తెలిపారు. ‘ఆ ముగ్గురు ఔటవగానే జట్టును ముందుకు తీసుకెళ్లే ప్లేయర్ కనపడటం లేదు. దీన్ని ప్రత్యర్థి జట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. అలాగే SRH హోంగ్రౌండులో మినహా మిగతా మైదానాల్లో ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ అంశాలపై మేనేజ్‌మెంట్ దృష్టిసారించకపోతే ఇబ్బందులు తప్పవు’ అని పేర్కొన్నారు.

News March 15, 2026

జనగణనకు 76వేల మంది టీచర్లు

image

TG: మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే తొలిదశ <<19385989>>జనగణనకు<<>> 76వేల మంది టీచర్లను వినియోగించుకుంటామని సెన్సస్ డైరెక్టర్ భారతి చెప్పారు. పనితీరును పరిశీలించేందుకు ప్రతి 6-7 మంది ఎన్యూమరేటర్లకు ఓ సూపర్ వైజర్, రాష్ట్రవ్యాప్తంగా 762 మంది ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. పౌరులే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు APR 26-మే 10 వరకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్/యాప్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.