News March 8, 2025
12న వైసీపీ ‘యువత పోరు’

AP: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో వైసీపీ ఈ నెల 12న ఆందోళన చేయనుంది. ఈ నేపథ్యంలో ‘యువత పోరు’ పోస్టర్ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆవిష్కరించారు. ఆ రోజున అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద విద్యార్థులతో కలసి నిరసనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News February 5, 2026
22 ఏళ్లలో తొలిసారి.. PM స్పీచ్ లేకుండానే ధన్యవాద తీర్మానం పాస్

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది. PM మోదీ స్పీచ్ లేకుండానే ఆమోదం తెలపడం గమనార్హం. ఇలా జరగడం 2004 తర్వాత ఇదే తొలిసారి. USతో ట్రేడ్ డీల్పై విపక్ష నేతల నిరసనలతో ప్రధాని ప్రసంగించకుండానే నిన్న లోక్సభ వాయిదా పడింది. ఇవాళ సభ ప్రారంభమవగానే తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. దీంతో నేడే కేంద్ర బడ్జెట్పై చర్చ మొదలయ్యే అవకాశం ఉంది.
News February 5, 2026
రాష్ట్రంలో 859 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

TG: జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్, జూ.అసిస్టెంట్, టైపిస్ట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. జాబును బట్టి 7వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయోపరిమితి 18-46 ఏళ్లు. ఈ నెల 13 వరకు అప్లై చేసుకోవచ్చు. CBT, స్కిల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://tshc.gov.in/
News February 5, 2026
రీప్రోగ్రామింగ్తో క్యాన్సర్ మటుమాయం!

క్యాన్సర్ కణాలను చంపడం కంటే వాటిని మళ్లీ సాధారణ కణాలుగా మార్చడమే సరైన మార్గమని సౌత్ కొరియా శాస్త్రవేత్తలు నిరూపించారు. MYB, HDAC2, FOXA2 అనే జన్యువులను నియంత్రించి పెద్దపేగు క్యాన్సర్ కణాలను తిరిగి ఆరోగ్యకరమైన కణాలుగా మార్చడంలో విజయం పొందారు. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు లేకుండానే రీప్రోగ్రామింగ్ ద్వారా కణాల స్వభావాన్ని మార్చి ట్యూమర్లను తగ్గించవచ్చని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేల్చారు.


