News September 12, 2024

ఏచూరి భౌతికకాయం AIIMSకు అప్పగింత

image

అనారోగ్యంతో <<14084560>>చనిపోయిన<<>> సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎల్లుండి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తీసుకురానున్నారు. ఆయనకు చైనా, వియత్నాం, రష్యా, వెనిజుల కమ్యూనిస్టు నేతలు నివాళులర్పించనున్నారు. కాగా బోధన, పరిశోధనల కోసం ఏచూరి భౌతికకాయాన్ని కుటుంబీకులు ఢిల్లీ AIIMSకు డొనేట్ చేశారు.

Similar News

News August 28, 2025

నాలుగు జిల్లాలకు RED ALERT

image

TG: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 20 గంటల పాటు అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని వెల్లడించింది. కాగా నిన్న కురిసిన వర్షాలకు నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

News August 28, 2025

లాంగ్ గ్యాప్ తర్వాత RCB ట్వీట్.. ఏమందంటే?

image

దాదాపు 3 నెలల తర్వాత RCB Xలోకి రీఎంట్రీ ఇచ్చింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పెషల్ లెటర్ పోస్ట్ చేసింది. ‘సైలెన్స్ ఆబ్సెన్స్ కాదు.. బాధ. JUN 4th అంతా మార్చేసింది. హృదయాల్ని ముక్కలు చేసింది. ఈ సమయంలో ‘RCB CARES’కి ప్రాణం పోశాం. ఫ్యాన్స్‌కు అండగా నిలిచేందుకు ఈ ప్లాట్‌ఫామ్ తోడ్పడుతుంది. మేం తిరిగొచ్చింది సెలబ్రేషన్‌తో కాదు.. మీతో కలిసి నడవడానికి. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని పేర్కొంది.

News August 28, 2025

డేటింగ్ యాప్స్‌లో మహిళా యూజర్లే ఎక్కువ!

image

సాధారణంగా డేటింగ్ యాప్స్‌లో పురుషులే ఎక్కువగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఇండియాలోని డేటింగ్, మ్యాట్రిమోనియల్ సైట్స్, యాప్స్‌లో ఫీమేల్ యూజర్లే ఎక్కువ ఉన్నారని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్‌లో 57% మంది సబ్‌స్క్రైబర్లు మహిళలే అని చెప్పారు. 6 నెలలకు సబ్‌స్క్రిప్షన్ ఫీ రూ.57,459 ఉన్నప్పటికీ వారు వెనుకాడటం లేదని పేర్కొన్నారు.