News January 14, 2025

నేడు పసుపు బోర్డు ప్రారంభం

image

TG: కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పర్వదినాన పసుపు బోర్డును ఇవాళ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే జాతీయ బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 15 ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకు రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News October 23, 2025

అభ్యంగన స్నానం వెనుక ఆంతర్యమిదే!

image

శరీరాద్యంతము తైలమును అంటుకోవడమే అభ్యంగనం. అనగా ఆముదము గానీ, నువ్వుల నూనె గానీ, నెయ్యి, వెన్న మొదలైన ఏదో ఒక తైలమును శరీరమంతా బాగా పట్టించి కనీసం 30 నిమిషాల తర్వాత శీకాయపొడి కానీ, పెసరపిండి కానీ, శనగపిండి గానీ ఉపయోగించి గోరువెచ్చటి నీటితో స్నానము చేయాలి. ఇది ఆధ్యాత్మిక నియమమే కాదు. ఆరోగ్యకరం కూడా! అందుకే పండుగల్లో దీన్ని విధిగా ఆచరించాలని మన పెద్దలు సూచిస్తుంటారు. కార్తీక మాసంలో ఈ నియమం ముఖ్యం.

News October 23, 2025

ఇంటి చిట్కాలు

image

* చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్‌ పొడి చల్లాలి.
* కాస్త వెనిగర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి డైనింగ్ టేబుల్ తుడిస్తే ఎలాంటి మరకలైనా పోతాయి.
* ట్యాపులపై ఉండే మచ్చలు పోయి కొత్తవాటిలా మెరవాలంటే వారానికోసారి నిమ్మకాయ ముక్కతో రుద్దాలి.
* కొవ్వొత్తులను వెలిగించే ముందు వాటి పైభాగాన కాస్త ఉప్పు రాస్తే ఎక్కువ సమయం వెలుగుతాయి.

News October 23, 2025

ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలివిగో!

image

సాధారణంగా వేధించే ఆరోగ్య సమస్యలకు తగిన విటమిన్లు, ఖనిజాలు తీసుకోవడం ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. జుట్టు రాలకుండా ఉండేందుకు బయోటిన్ (B7)& A, E, అలసటకు విటమిన్ B12& D& ఐరన్, మొటిమలకు విటమిన్ A& జింక్, పొడి చర్మానికి విటమిన్ C & E, ఒమేగా-3 వంటివి ప్రయోజనకరం. తలనొప్పికి మెగ్నీషియం & B2, వీక్‌నెస్‌కి B1& D & మెగ్నీషియం ఆహారంలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. SHARE IT