News January 14, 2025
నేడు పసుపు బోర్డు ప్రారంభం

TG: కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పర్వదినాన పసుపు బోర్డును ఇవాళ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే జాతీయ బోర్డు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 15 ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకు రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News September 18, 2025
సినీ ముచ్చట్లు!

*పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్. పోస్టర్లు రిలీజ్
*నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘అఖండ-2’ షూటింగ్ హైదరాబాద్లో సాగుతోంది. ఓ పార్టీ సాంగ్ని చిత్రీకరిస్తున్నారు.
*‘సైయారా’ మూవీ నెట్ఫ్లిక్స్లో అదరగొడుతోంది. 9.3 మిలియన్ గంటల వ్యూయర్షిప్తో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లిష్ ఫిల్మ్గా నిలిచింది.
News September 18, 2025
జుట్టు లేని కొబ్బరి కాయను కొట్టకూడదా?

దేవుడికి జుట్టు లేని కొబ్బరికాయను కొట్టకూడదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ మన శరీరానికి ప్రతీక. దానిపై ఉన్న పీచు మనలోని అహంకారానికి, జ్ఞానానికి చిహ్నం. భగవంతునికి మన శరీరాన్ని, ఆత్మను సంపూర్ణంగా సమర్పించుకోవడానికి కొబ్బరికాయ కొడతాం. అందుకే జుట్టు ఉన్న కొబ్బరికాయనే కొట్టి, ఆత్మనివేదన అనే భక్తి మార్గాన్ని అనుసరించాలి. జుట్టు లేని కాయను సమర్పించడం అసంపూర్ణ సమర్పణగా భావిస్తారు.
News September 18, 2025
సాయిబాబా విగ్రహం పాలరాయితోనే ఎందుకు?

పాలరాయి ఆధ్యాత్మికంగా స్వచ్ఛతకు, బలానికి ప్రతీక. ఈ లక్షణాలు బాబా బోధనలకు అనుగుణంగా ఉంటాయి. పాలరాయి విగ్రహం ఉన్న చోట ప్రశాంతమైన, సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఇది సహజమైనది, ప్రాసెస్ చేయనిది కావడంతో పవిత్రంగా పూజా మందిరాల్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అనేక ఆలయాల్లోనూ పాలరాయితో చేసిన సాయిబాబా విగ్రహాలే మనకు దర్శనమిస్తుంటాయి.