News January 14, 2025
నేడు పసుపు బోర్డు ప్రారంభం

TG: కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పర్వదినాన పసుపు బోర్డును ఇవాళ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే జాతీయ బోర్డు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 15 ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకు రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 17, 2025
ఢిల్లీ బ్లాస్ట్లో 15మంది మృతి: పోలీసులు

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో NIA, ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరోవైపు మృతుల సంఖ్యపై కూడా ఓ స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు ఈ పేలుడు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అటు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించాడన్న అనుమానంతో కశ్మీరుకు చెందిన అమీర్ రషీద్ అలీని నిన్న NIA <<18306148>>అరెస్టు <<>>చేసిన విషయం తెలిసిందే. అతడిని కశ్మీర్కు తీసుకెళ్లి తదుపరి విచారణ కొనసాగించనుంది.
News November 17, 2025
ఢిల్లీ బ్లాస్ట్లో 15మంది మృతి: పోలీసులు

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో NIA, ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరోవైపు మృతుల సంఖ్యపై కూడా ఓ స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు ఈ పేలుడు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అటు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించాడన్న అనుమానంతో కశ్మీరుకు చెందిన అమీర్ రషీద్ అలీని నిన్న NIA <<18306148>>అరెస్టు <<>>చేసిన విషయం తెలిసిందే. అతడిని కశ్మీర్కు తీసుకెళ్లి తదుపరి విచారణ కొనసాగించనుంది.
News November 17, 2025
డెలివరీకి సిద్ధంగా ఉన్నారా?

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఇంట్లోకి సంతోషం వచ్చేస్తుంది. ఈ సంతోషం కలకాలం ఉండాలంటే సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయాల్లో ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాది పాటు దుస్తులు, ఆహారం, వస్తువులు, మందులు ఇలా అన్నింటికీ సరిపడా పొదుపు చేసుకోవాలి. ఏది అవసరమో.. ఏది కాదో చూసి కొనుక్కోవాలి. ఎమర్జెన్సీ కోసం కాస్త డబ్బు దాచి ఉంచాలి.


