News September 27, 2024
అవును.. PM ఆఫర్లు వచ్చాయి: నితిన్ గడ్కరీ

తనకు చాలాసార్లు పీఎం ఆఫర్లు వచ్చాయని BJP అగ్రనేత నితిన్ గడ్కరీ అన్నారు. ఆ పోస్టు తీసుకుంటానంటే ఓ అపోజిషన్ పార్టీ లీడర్ సపోర్టు చేస్తానన్న వార్తలపై ఇండియా టుడే కాంక్లేవ్లో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘LS ఎలక్షన్లకు ముందు, తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. నా ఐడియాలజీని వదిలేయలేను. అందుకే వాటిని అంగీకరించే ప్రశ్నే రాలేదు. పీఎం అవ్వడం నా లక్ష్యం కాదు. నా ఐడియాలజీపై నమ్మకంతో బతుకుతున్నా’ అని అన్నారు.
Similar News
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.
News November 27, 2025
పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.


