News July 13, 2024
మొన్న అయోధ్య, ఇప్పుడు బద్రీనాథ్.. బీజేపీకి భంగపాటు!

హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ BJP దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, బద్రీనాథ్లో ఓటమిపాలవడం విస్మయానికి గురిచేస్తోంది. రాముడే ప్రధాన అస్త్రంగా BJP లోక్సభ ఎన్నికల బరిలో దిగింది. అయోధ్య(ఫైజాబాద్ లోక్సభ స్థానం)లో ఆ పార్టీ అభ్యర్థి లల్లూ సింగ్పై SP అభ్యర్థి అవధేశ్ గెలుపొందారు. తాజాగా వెలువడిన బద్రీనాథ్ అసెంబ్లీ ఉపఎన్నికలో INC అభ్యర్థి లఖ్పత్ చేతిలో BJP అభ్యర్థి రాజేంద్ర సింగ్ ఓటమిపాలయ్యారు.
Similar News
News January 26, 2026
తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

సీజన్తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్కు బ్రాండ్ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.


