News May 19, 2024
అకౌంట్లలోకి ‘చేయూత’ స్కీమ్ నగదు

AP: వైఎస్సార్ చేయూత పథకం నిధులను ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ స్కీమ్ కింద రూ.5065 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.1552.32 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా రూ.3512.68 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం కింద 45-60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 ఆర్థిక సాయం అందిస్తున్నారు. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
Similar News
News December 7, 2025
స్కూల్పై దాడి.. 43 మంది చిన్నారులు మృతి

సుడాన్లో ఆర్మీ, రెబల్స్(పారా మిలిటరీ) మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఆర్మీ కంట్రోల్లో ఉన్న కలోగిపై రెబల్స్ చేసిన డ్రోన్ దాడిలో 79 మంది మరణించారు. వీరిలో 43 మంది చిన్న పిల్లలు ఉన్నారు. మరో 38 మంది గాయపడ్డారు. రెబల్స్ తొలుత కిండర్గార్టెన్(స్కూల్), ఆస్పత్రిపై దాడి చేశారు. పిల్లలను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా మళ్లీ అటాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 7, 2025
‘ క్రీమీలేయర్’ తీర్పుతో సొంతవర్గం నుంచే విమర్శలు: గవాయ్

SC రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలు తీర్పుతో తాను సొంతవర్గాల నుంచే విమర్శలు ఎదుర్కొన్నానని మాజీ CJI గవాయ్ పేర్కొన్నారు. ‘అంబేడ్కర్ దృష్టిలో జీరో దగ్గర ఉన్న వెనుకబడ్డ వ్యక్తికి సైకిల్ ఇవ్వాలి. అప్పుడే అతడు సైకిల్పై ముందున్న వారిని చేరుకొని సమానంగా నడుస్తాడు. అంతే తప్ప సైకిల్పై ఎప్పటికీ అతడే వెళ్తూ జీరో దగ్గర ఉన్నవారిని అలాగే ఉండాలనరాదు’ అని ముంబై వర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.
News December 7, 2025
రోహిత్ శర్మ మరో 984 పరుగులు చేస్తే..

ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లలో రోహిత్ శర్మ(20,048) 13వ స్థానంలో ఉన్నారు. Top10లో నిలవాలంటే ఇంకా 984 రన్స్ చేయాలి. ప్రస్తుతం పదో స్థానంలో జయసూర్య(21,032) కొనసాగుతున్నారు. 11, 12 స్థానాల్లో ఉన్న చందర్పాల్, ఇంజమామ్ రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో టాప్ 10లోకి ఎంటరయ్యే ఛాన్స్ రోహిత్కు ఉంది. 2027 ODI WC వరకు ఆడితే ఇది సాధ్యమేనని క్రికెట్ విశ్లేషకుల అంచనా.


