News June 30, 2024
మీరు అలా.. మేం ఇలా!

T20WC గెలిచిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ ట్రోఫీని గుండెలకు హత్తుకొని విజయాన్ని ఆస్వాదించారు. కాగా ఈ నేపథ్యంలోనే గతేడాది వరల్డ్ కప్పై ఆస్ట్రేలియా క్రికెటర్ మార్ష్ కాళ్లు పెట్టిన క్షణాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు మార్ష్ అందరి మనసును గాయపరిస్తే ఇప్పుడు రోహిత్ అందరి హృదయాలు గెలుచుకున్నారని అభిప్రాయపడుతున్నారు. కల్చర్ పరంగా ఇద్దరి మధ్య ఉన్న తేడా ఇదేనని అంటున్నారు.
Similar News
News January 8, 2026
ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా.. నోబెల్ ఇవ్వరా: ట్రంప్

తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నార్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా. నాటో సభ్య దేశమైన నార్వే నన్ను నోబెల్కు ఎంపిక చేయకుండా ఫూలిష్గా వ్యవహరించింది. అయినా నోబెల్ నాకు మ్యాటర్ కాదు. ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడాను. అది చాలు’ అని ట్వీట్ చేశారు. అమెరికా లేకుంటే నాటోను ఎవరూ పట్టించుకోరని.. రష్యా, చైనాలు దాన్ని లెక్కచేయవని స్పష్టం చేశారు.
News January 8, 2026
రాత్రి పూట ఇవి తినొద్దు: వైద్యులు

నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఆకలి, నిద్రను కంట్రోల్ చేసుకునేందుకు ఏది పడితే అది తింటారు. మసాలా, నూనె పదార్థాలు, చిప్స్, బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల కడుపులో మంట, గ్యాస్తో పాటు కొవ్వు పెరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ బదులు బాదం, బ్రోకలీ, బెర్రీస్, సలాడ్స్ వంటి హెల్తీ ఫుడ్ తీసుకెళ్లాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.
News January 7, 2026
ఒప్పో సబ్ బ్రాండ్లుగా రియల్మీ, వన్ ప్లస్.. కారణమిదే!

చైనా మొబైల్ కంపెనీలు రియల్మీ, వన్ ప్లస్ ఇకపై ఒప్పో సబ్ బ్రాండ్లుగా మారనున్నాయి. ఒప్పో సారథ్యంలోనే ఇవి పని చేయనున్నాయి. నిజానికి ఒప్పో, వివో, వన్ ప్లస్, రియల్మీ కంపెనీలు BBK ఎలక్ట్రానిక్స్కు చెందినవి. తాజా నిర్ణయంతో వేర్వేరుగా రీసెర్చ్&డెవలప్మెంట్, సేల్స్, లాజిస్టిక్ టీమ్స్ అవసరం ఉండదు. వనరులను సమీకరించుకుని, ఖర్చులను తగ్గించుకుని మార్కెట్లో మరింత వృద్ధి చెందాలని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి.


