News June 30, 2024
మీరు అలా.. మేం ఇలా!
T20WC గెలిచిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ ట్రోఫీని గుండెలకు హత్తుకొని విజయాన్ని ఆస్వాదించారు. కాగా ఈ నేపథ్యంలోనే గతేడాది వరల్డ్ కప్పై ఆస్ట్రేలియా క్రికెటర్ మార్ష్ కాళ్లు పెట్టిన క్షణాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు మార్ష్ అందరి మనసును గాయపరిస్తే ఇప్పుడు రోహిత్ అందరి హృదయాలు గెలుచుకున్నారని అభిప్రాయపడుతున్నారు. కల్చర్ పరంగా ఇద్దరి మధ్య ఉన్న తేడా ఇదేనని అంటున్నారు.
Similar News
News September 20, 2024
మహిళల ఖాతాల్లోకి రూ.1,500.. త్వరలో మార్గదర్శకాలు
AP: మరో ఎన్నికల హామీ అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆడబిడ్డ నిధి కింద 18-59 ఏళ్ల మహిళల ఖాతాల్లో నెలకు ₹1,500 చొప్పున జమ చేయడంపై మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. సెర్ప్ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. డ్వాక్రా సంఘాలకు ₹10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాల అమలుకు విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఇందుకు ఏడాదికి ₹5వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
News September 20, 2024
నేటి నుంచి సివిల్స్ మెయిన్స్
నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్-2024 ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1 ఉ.9 నుంచి మ.12 వరకు జరుగుతుంది. ఉ.8.30కు గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత లోపలికి అనుమతించరు. హాల్ టికెట్, ఐడీ కార్డు కచ్చితంగా తీసుకెళ్లాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం ఉంటుంది.
News September 20, 2024
అశ్విన్ సూపర్ సెంచరీ.. పలు రికార్డులు
BANపై సెంచరీ చేసిన అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఒకే వేదికలో 2సెంచరీలు, పలుమార్లు 5+ వికెట్లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో చేరారు. అశ్విన్ చెన్నైలో 2 సెంచరీలు, 4సార్లు 5 వికెట్లు తీశారు. సోబెర్స్ హెడ్డింగ్లీలో, కపిల్ చెన్నైలో, క్రెయిన్స్ ఆక్లాండ్లో, ఇయాన్ హెడ్డింగ్లీలో ఈ ఫీట్ చేశారు. అలాగే నం.8 లేదా దిగువన బ్యాటింగ్కు దిగి అత్యధిక సెంచరీలు(4) చేసిన రెండో ప్లేయర్గా అశ్విన్ నిలిచారు.