News August 16, 2024
వండకపోయినా ఈ రైస్ తినొచ్చు!

అసలు వండకుండానే అన్నం రెడీ అయ్యే ప్రత్యేక రకం రైస్ ఉందనే విషయం మీకు తెలుసా? అస్సాంలో లభించే ‘బోకా సౌల్’ రకం బియ్యాన్ని 30 ని. నానపెడితే చాలు రైస్ రెడీ అయిపోతుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రొటీన్లతో కూడినది. 17వ శతాబ్దంలో మొఘల్లతో పోరాడే సమయంలో సైనికులు వీటిని వినియోగించేవారు. త్వరగా జీర్ణం అవుతుంది. ఇది ఎమర్జెన్సీ ఫుడ్గా ఉపయోగపడుతుంది. 2019లో GI ట్యాగ్ కూడా లభించింది.
Similar News
News December 18, 2025
ఈశాన్య మూల పెరగడం మంచిదేనా?

ఈశాన్య మూల పెరిగిన స్థలం సంపదలకు మూలమని కొందరు చెబుతారు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం శుభకరమని నమ్ముతారు. అయితే, ఈశాన్యం మరీ ఎక్కువగా పెరగడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘దీనివల్ల ఉత్తర-వాయువ్యం, తూర్పు-ఆగ్నేయం మూలలు తగ్గే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆ దిశల నుంచి దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అందుకే కేవలం స్థలం ప్రహరీగోడలో స్వల్పంగా మార్పు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News December 18, 2025
ఫలితాలు విడుదల

TG: గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక పోస్ట్ వెరిఫికేషన్ కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది. మరో 17 పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామంది. లిస్ట్ కోసం ఇక్కడ <
News December 18, 2025
22న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

AP: జనసేన బలోపేతంపై ఆ పార్టీ చీఫ్, Dy.CM పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో ఈ నెల 22న విస్తృత సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. ‘పదవి-బాధ్యత’ పేరుతో మంగళగిరిలో జరిగే ఈ భేటీలో నాయకులకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, MLAలు, MLCలు, MPలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవుల్లో ఉన్నవారు హాజరుకావాలని ఆదేశించారు.


