News January 20, 2025
సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడొచ్చు!

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటర్-సర్కిల్ రోమింగ్ను ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సిగ్నలింగ్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 4G నెట్వర్క్ అందిస్తుంది. యూజర్ వాడే సిమ్లో నెట్వర్క్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఏ నెట్వర్క్నైనా ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం టెలికం యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.
Similar News
News November 14, 2025
NHIDCLలో ఉద్యోగాలు

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(NHIDCL) 6 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్స్ మెయిన్స్- 2024 రాసి ఇంటర్వ్యూకు ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34 ఏళ్లు. సివిల్స్ మెయిన్స్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nhidcl.com/
News November 14, 2025
జూబ్లీ బలం: ఈ నెలలోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం కాంగ్రెస్కు, ప్రభుత్వానికి ఊపు ఇచ్చింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికలకు GOVT సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 42% BC రిజర్వేషన్లకు లీగల్ సమస్యలుండడంతో మొత్తం 50% లోపే అవి ఉండేలా అధికారులు మరో నివేదికను ఇప్పటికే రెడీ చేశారు. దీనిపై BCల నుంచి వ్యతిరేకత రాకుండా ఆ నేతలకు వివరించాలని మంత్రులకు CM సూచించినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ నెలాఖరులో రావచ్చని భావిస్తున్నారు.
News November 14, 2025
10 ఉపఎన్నికలు వస్తే ఏం చేస్తారో చూద్దాం: KTR

TG: ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ఎక్కడా తగ్గకుండా పోరాటం కొనసాగిస్తామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘ప.బెంగాల్లో BJP నుంచి TMCలో చేరిన MLAపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. అక్కడ జరిగిందే ఇక్కడా జరుగుతుందని ఆశిస్తున్నాం. దేశమంతా ఒకటే రూల్ కదా. ఒక్క ఉపఎన్నికకే కాంగ్రెస్ నేతలు ఆపసోపాలు పడ్డారు. 10 ఉపఎన్నికలు వస్తే వాళ్లకు ముచ్చెమటలు పడతాయేమో. ఏం చేస్తారో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు.


