News January 20, 2025

సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడొచ్చు!

image

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటర్-సర్కిల్ రోమింగ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సిగ్నలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 4G నెట్‌వర్క్ అందిస్తుంది. యూజర్ వాడే సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం టెలికం యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.

Similar News

News December 15, 2025

మోదీ, మెస్సీ మీటింగ్ క్యాన్సిల్!

image

ఢిల్లీలో తీవ్ర పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో మెస్సీ టూర్ ఆలస్యమైంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 2గంటలకు విమానం ల్యాండ్ అయింది. అక్కడి నుంచి హోటల్‌లో గ్రీట్ అండ్ మీట్‌లో పాల్గొని 4PMకు జైట్లీ స్టేడియానికి చేరుకుంటారు. సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో సహా కోట్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ఫ్లైట్ ఆలస్యం కారణంగా మోదీతో భేటీ క్యాన్సిల్ అయింది.

News December 15, 2025

భారీ జీతంతో మేనేజర్ పోస్టులు

image

<>ఉడిపి <<>>కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 3 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(మెకానికల్/నావల్ ఆర్కిటెక్చర్/మెరైన్ Eng) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. మేనేజర్‌కు నెలకు రూ.1,18,400, డిప్యూటీ మేనేజర్‌కు రూ.98,400 చెల్లిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News December 15, 2025

రాకెట్ ఉమెన్ ఆఫ్‌ ఇండియా రీతు కరిధాల్

image

లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రీతు కరిధాల్ 1997లో ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా చేరారు. ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులైన మార్స్ ఆర్బిటార్ మిషన్, మంగళ్‌యాన్ ప్రయోగాలకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2కి మిషన్‌ డైరెక్టర్‌గా రీతూ బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు.