News January 20, 2025

సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడొచ్చు!

image

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటర్-సర్కిల్ రోమింగ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సిగ్నలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 4G నెట్‌వర్క్ అందిస్తుంది. యూజర్ వాడే సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం టెలికం యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.

Similar News

News December 11, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పారిశ్రామిక రంగం, అమరావతికి నాబార్డు రుణం, పలు అభివృద్ధి పనులపై చర్చించనుంది. గవర్నర్ నివాసంగా కొత్తగా లోక్‌భవన్ నిర్మాణానికి టెండర్లు, జుడీషియల్ అకాడమీకి పరిపాలన అనుమతులు ఇవ్వనుంది. అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

News December 11, 2025

దీక్షలో ఉన్నప్పుడు కాఫీ, టీ తీసుకోవచ్చా?

image

దీక్షలో ఉన్నప్పుడు కడుపు ఖాళీ ఉంటుంది. ఇదే సమయంలో టీ, కాఫీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణుల సలహా! దీనివల్ల గ్యాస్, గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయని అంటున్నారు. ఒకటి కన్నా ఎక్కువ కప్పులు తీసుకోకూడదని, చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. శక్తిని కోల్పోకుండా ఉండేందుకు కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి పానీయాలు తీసుకోవడం ఉత్తమం’ అని చెబుతున్నారు.

News December 11, 2025

మంచం మీద కూర్చొని ఎందుకు తినకూడదు?

image

ఇంట్లో ఆదాయం పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా జ్యోతిష నియమాలు పాటించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం దరిద్రాన్ని ఆహ్వానించినట్టేనని అంటున్నారు. ‘ఇలా తినడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా డబ్బు రాక నిలిచిపోతుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. వాస్తు దోషాలను సృష్టించి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు కలగవచ్చు’ అని వివరిస్తున్నారు.