News January 4, 2025
వీసా లేకుండా ఈ దేశాలకు వెళ్లొచ్చు

భారత టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు కొన్ని దేశాలు వీసా లేకుండానే ప్రవేశించేలా సడలింపులు తీసుకొచ్చాయి. అందులో థాయ్లాండ్, మలేషియా, మారిషస్, జమైకా, మాల్దీవ్స్, కెన్యా, మకావు, బార్బడోస్, కజకిస్థాన్, గాంబియా, నేపాల్, ఎల్ సాల్వడార్, భూటాన్, హైతీ, సీషెల్స్, సెనెగల్, గ్రెనడా, అంగోలా, డొమినికా, మోంట్సెరాట్, సెయింట్ కిట్స్ & నెవిస్, మైక్రోనేషియా, ట్రినిడాడ్ & టబాగో ఉన్నాయి. మీరెక్కడికైనా వెళ్తున్నారా?
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


