News March 20, 2025
నన్ను కలిసేందుకు డబ్బులు అవసరం లేదు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి లండన్ టూర్ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్ మీట్ పేరుతో చిరును కలిసే అవకాశం కల్పిస్తామంటూ కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చిరు Xలో స్పందించారు. ‘ఫ్యాన్ మీటింగ్ పేరుతో ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. వారి డబ్బులు వెనక్కి ఇచ్చేయండి. నన్ను కలవడానికి ఎవరికీ డబ్బులు చెల్లించనక్కర్లేదు’ అని ఫ్యాన్స్కు సూచించారు.
Similar News
News November 21, 2025
ములుగు: ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి: PO

ఉమ్మడి వరంగల్ పరిధిలోని గిరిజన అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఏటురునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు రెసిడెన్షియల్ పద్ధతిలో స్క్రీనింగ్ నిర్వహించి, ఎంపికైన వారికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 25లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు 7675978439 నంబర్ను సంప్రదించాలన్నారు.
News November 21, 2025
ములుగు: ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి: PO

ఉమ్మడి వరంగల్ పరిధిలోని గిరిజన అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఏటురునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు రెసిడెన్షియల్ పద్ధతిలో స్క్రీనింగ్ నిర్వహించి, ఎంపికైన వారికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 25లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు 7675978439 నంబర్ను సంప్రదించాలన్నారు.
News November 21, 2025
‘పసిడి’ పంచ్.. ఫైనల్లో గెలిచిన నిఖత్ జరీన్

వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో నిఖత్ జరీన్ విజయం సాధించారు. 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. జువాన్ యి గువో (చైనీస్ తైపీ)పై 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. నిఖత్ గెలుపుతో ఈ టోర్నీలో భారత మహిళలు గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 5కు చేరింది. మొత్తంగా ఈ టోర్నీలో 9 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ను భారత్ సాధించింది.


