News April 3, 2024
కివీస్ టీ20 కెప్టెన్గా యంగ్ సెన్సేషన్

న్యూజిలాండ్ టీ20 కెప్టెన్గా యంగ్ సెన్సేషన్ మైకేల్ బ్రేస్వెల్ ఎంపికయ్యారు. త్వరలో పాకిస్థాన్తో జరగబోయే సిరీస్లో ఆయన సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా పాక్తో తలపడే జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టు: బ్రేస్వెల్, ఫిన్ అలెన్, చాప్మన్, క్లార్క్సన్, జాకబ్ డఫ్ఫీ, ఫాక్స్క్రాఫ్ట్, లిస్టర్, మెకంజీ, మిల్నే, నీషమ్, విల్ రౌర్కీ, రాబిన్సన్, బెన్ సియర్స్, సీఫర్ట్, ఇష్ సోధీ.
Similar News
News January 20, 2026
JAN 26 తర్వాత సాదా బైనామాలపై కొత్త రూల్స్!

TG: LRSలో పెండింగ్లో ఉన్న దాదాపు 9 L సాదా బైనామా అప్లికేషన్లను పరిష్కరించడానికి GOVT కొత్త రూల్స్ సిద్ధం చేస్తోంది. భూ భారతిలో సాంకేతిక సమస్యలు, దరఖాస్తుదారులు, భూ యజమానుల మధ్య వివాదాలతో వీటిని రూపొందిస్తోంది. అఫిడవిట్ల విధానాన్నీ మార్చనుంది. ఇవి JAN26 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా దరఖాస్తుదారులకు హక్కులు కల్పిస్తే అధికారులపై కోర్టులకు వెళ్తామని యజమానులు హెచ్చరించడంతో తర్జనభర్జన పడుతున్నారు.
News January 20, 2026
బంగారం ఆల్ టైమ్ హై.. 10 గ్రా. రూ.1.52 లక్షలు

పసిడి పరుగులు ఆగడం లేదు. ఇవాళ మరోసారి పెరిగి ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర ఏకంగా రూ.1,52,000 (3 శాతం జీఎస్టీతో కలిపి) దాటింది. సిల్వర్ కూడా రిటైల్ ధర కిలో రూ.3,39,900 (3% GSTతో కలిపి) పైనే పలుకుతోంది.
News January 20, 2026
రిపబ్లిక్ వేడుకలకు సీఎం రేవంత్ దూరం

TG: CM రేవంత్ రెడ్డి రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావడం లేదు. JAN 25 నుంచి 30 వరకు USలోని హార్వర్డ్ వర్సిటీలో లీడర్షిప్ శిక్షణ తరగతులకు ఆయన హాజరవుతారు. JAN 23న దావోస్ పర్యటన ముగిసిన వెంటనే, ఆయన అమెరికా వెళ్లి కొంతమంది పారిశ్రామికవేత్తలను కలుస్తారు. తర్వాత యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతారు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యమంత్రి లేకుండానే ప్రసంగిస్తారు.


