News September 5, 2025

యంగ్ సెన్సేషన్.. వన్డేల్లో చరిత్ర సృష్టించాడు

image

సౌతాఫ్రికా యంగ్ క్రికెటర్ మాథ్యూ బ్రిట్జ్‌కే వన్డేల్లో చరిత్ర సృష్టించారు. తొలి ఐదు వన్డే మ్యాచ్‌లలో 50+ స్కోర్స్ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 85 రన్స్ చేసిన బ్రిట్జ్‌కే ఈ ఫీట్ సాధించారు. ఈ 26 ఏళ్ల యంగ్ సెన్సేషన్ న్యూజిలాండ్‌తో ఆడిన అరంగేట్ర మ్యాచ్‌లోనే 150 రన్స్‌తో అదరగొట్టారు. ఆ తర్వాత పాక్‌పై 83, AUSపై 57, 88, తాజాగా ENGపై 85 రన్స్ చేశారు.

Similar News

News September 5, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద PM ఆవాస్ యోజన నిధులు విడుదల అయ్యేందుకు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రామాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి వివరాలను పంచాయతీ కార్యదర్శులు మళ్లీ సేకరిస్తున్నారు. దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలను యాప్‌లో ఎంటర్ చేస్తున్నారు. ఇందుకు ఈనెల 9 వరకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.

News September 5, 2025

నేడు విశాఖ, విజయవాడలో పర్యటించనున్న CM

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖ నగరానికి చేరుకుని అక్కడ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్నారు. పర్యటన అనంతరం మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరి ఉండవల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటారు.

News September 5, 2025

వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం

image

TG: HYDలో రేపు జరిగే వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 50 వేల విగ్రహాలతో 303KM మేర శోభాయాత్రలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్‌ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.