News December 3, 2024
నీ త్యాగం.. రాష్ట్ర గుండెలపై శాశ్వతం.!: CM రేవంత్

తెలంగాణ మలి దశ ఉద్యమ అమరుడు శ్రీకాంతచారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ‘నీ త్యాగం, తెలంగాణ గుండెలపై పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తోంది. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, శ్రీకాంతచారి 13 ఏళ్ల క్రితం LB నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణం చేసుకున్న దృశ్యాలు నేటికీ TG ప్రజల గుండెల్లో జై తెలంగాణ నినాదాన్ని రగిలిస్తూనే ఉంటాయి.
Similar News
News March 26, 2026
మొదలైన SRHvsLSG టికెట్ల సేల్స్

IPL-2026 సందడి మొదలైంది. ఏప్రిల్ 5న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే SRHvsLSG మ్యాచ్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. District యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లను <
News March 26, 2026
విశాఖకు చేరుకున్న భారీ నౌకలు

AP: గ్యాస్, పెట్రోల్ ఇబ్బందుల నేపథ్యంలో విశాఖ తీరానికి భారీ LPG, చమురు నౌకలు చేరుకున్నాయి. 47 వేల టన్నుల ఎల్పీజీతో BW Birch షిప్, 28 వేల టన్నుల క్రూడాయిల్తో MT Petroit షిప్ పోర్టుకు వచ్చాయి. యూఏఈ నుంచి ఈ రెండు నౌకలు ఈ నెల 20న బయలుదేరాయి. మధ్యలో వడినార్, ముంద్రా పోర్టుల్లో కొంత LPG, క్రూడ్ను దిగుమతి చేశాయి. తాజాగా వైజాగ్ హార్బర్ మౌత్లో లంగరేశాయి.
News March 26, 2026
రోజులో 2 గంటలు ట్రాఫిక్లోనే టెకీ జీవితం

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణతో హైదరాబాద్ ఐటీ రంగం దూసుకుపోతోంది. అయితే ఇది ఉద్యోగుల ప్రయాణ సమయాన్ని పెంచేసిందని తాజా నివేదిక వెల్లడించింది. HYDలో ఒక్క ఐటీ ఉద్యోగి ఒకవైపు ప్రయాణానికే సగటున 59.5 నిమిషాలు వెచ్చిస్తున్నారు. అంటే రోజుకు దాదాపు రెండు గంటలు రోడ్ల మీద ట్రాఫిక్లోనే గడిచిపోతోంది. బెంగళూరు(67.5M), ఢిల్లీ(67.5M) స్థాయిలో హైదరాబాద్లోనూ ప్రయాణ సమయం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.


