News September 10, 2024
భారత్లో అత్యధికంగా యువత ఆత్మహత్యలు

భారత్లో యువత ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా వెల్లడించింది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో దాదాపు 40 శాతం మంది 30 ఏళ్లలోపువారే. ప్రపంచ సగటుతో పోలిస్తే యూత్ సూసైడ్స్ భారత్లో రెండింతలు ఎక్కువ. రోజుకు సగటున 160మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అంచనా. ఆత్మహత్యలు పరిష్కారం కాదని తాత్కాలిక ఆగ్రహావేశాలతో నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దని మానసిక నిపుణులు కోరుతున్నారు.
Similar News
News February 8, 2026
భారత్-అమెరికా డీల్: రష్యాతో దోస్తీకి ముప్పు పొంచి ఉందా?

అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గినా.. మాస్కోతో భారత మైత్రికి ఢోకా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. మన రక్షణ వ్యవస్థలో ఇప్పటికీ చాలా ఆయుధాలు రష్యావే. S-400 మిస్సైల్స్, అణుశక్తి వంటి విషయాల్లో ఆ దేశమే మన నమ్మకమైన భాగస్వామి. మరోవైపు చైనాను కట్టడి చేయాలన్నా మనకు పుతిన్ సహకారం చాలా కీలకం. అటు అమెరికా టెక్నాలజీని, ఇటు రష్యా నమ్మకాన్ని భారత్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.
News February 8, 2026
సిరాజ్ మియా.. హాలిడే ప్లాన్ నుంచి WCలోకి సడన్ ఎంట్రీ

సిరాజ్ అసలు ప్లాన్ జర్మనీకి హాలిడే ట్రిప్, స్పెయిన్లో ఫుట్బాల్ మ్యాచ్. కానీ హర్షిత్ గాయంతో T20 WCలో ఆడే అవకాశం వచ్చింది. దీనికి తోడు బుమ్రా అస్వస్థత వల్ల నేరుగా ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్ పవర్ప్లేలోనే వికెట్లు తీసి USను దెబ్బకొట్టారు. 3/29తో అదరగొట్టడంతో భారత్ విజయం సాధించింది. ‘దేవుడు రాసిన రాతను ఎవరూ మార్చలేరు’ అంటున్నారు ఈ హైదరాబాదీ మియా!
News February 8, 2026
క్రిష్-4కి బడ్జెట్ సెగ.. హృతిక్ వర్సెస్ ఆదిత్య చోప్రా!

‘క్రిష్ 4’ సినిమా బడ్జెట్ విషయంలో హృతిక్ రోషన్, నిర్మాత ఆదిత్య చోప్రా మధ్య డిఫరెన్సెస్ వచ్చినట్లు టాక్. డెబ్యూ డైరెక్టర్గా ఈ మూవీని హృతిక్ ₹500 కోట్లతో భారీగా ప్లాన్ చేస్తుంటే ఆదిత్య మాత్రం ₹350 కోట్లకే ఫినిష్ చేయాలని కండిషన్ పెట్టారట. దీంతో YRF ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొనే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ సినిమాతో ప్రియాంక బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


