News October 31, 2024
YSపై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

ఆస్తుల గొడవలతో పెద్దాయన(YSR) చరిత్రను నాశనం చేసేలా సొంత వారే ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ‘YSR ఉన్నప్పుడే జగన్ రూ. లక్ష కోట్ల సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంతనేది ఆలోచించాలి. వైఎస్ అక్రమ సంపాదనను ప్రజలకు పంచిపెట్టాలి. ఇది కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో చెప్పాలి’ అని ఆనం డిమాండ్ చేశారు.
Similar News
News December 23, 2025
TPT: అన్యమతస్థులతో గోవిందరాజస్వామి ఆలయ పనులు..?

గోవిందరాజస్వామి ఆలయం విమాన గోపురం బంగారు తాపడం పనులు కాంట్రాక్టర్ జ్యోత్ టెండర్ ద్వారా దక్కించుకుని మరో ఇద్దరు అన్యమతస్థులకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే వారికి ఎలాంటి రాతపూర్వకంగా ఇవ్వలేదని విజిలెన్స్ అధికారులు తేల్చారు. కాగా పనుల్లో అవకతవకలు, విగ్రహాలు తొలగించడంపై హిందూ సంఘాలు ఆరోపణల చేశాయి. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
News December 23, 2025
నెల్లూరు: అమ్మ చనిపోయింది.. నాన్న వదిలేశాడు.. ‘పాపం పసివారు’

తల్లికి వందనం ఇప్పించాలంటూ కలెక్టర్ హిమాన్షు శుక్లాకు పొదలకూరు (M) నల్లపాలనేకి చెందిన కీర్తన, మేరీ బ్లెస్సీ గ్రీవెన్స్లో తమ గోడు విన్నవించుకున్నారు. తమకు తల్లిదండ్రులు లేరని తల్లి మూడేళ్ల కిందట చనిపోయిందని, ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తండ్రి వదిలేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News December 23, 2025
వెంకటాచలం CHCకి జాతీయ స్థాయి గుర్తింపు

వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి క్వాలిటీ సర్టిఫికేషన్ (National Quality Assurance Standards-NQAS) లభించింది. వాటిలో వెంకటాచలం CHC ఒకటి. ఈ కేంద్రం 84.29 శాతం స్కోరు సాధించింది. దీంతో ఈ కేంద్రానికి రూ.3 లక్షల సర్టిఫికేషన్ ఇన్సెంటివ్, ఏటా రూ.1 లక్ష మెయింటినెన్స్ ఇన్సెంటివ్ అందనుంది.


