News October 31, 2024
YSపై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

ఆస్తుల గొడవలతో పెద్దాయన(YSR) చరిత్రను నాశనం చేసేలా సొంత వారే ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ‘YSR ఉన్నప్పుడే జగన్ రూ. లక్ష కోట్ల సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంతనేది ఆలోచించాలి. వైఎస్ అక్రమ సంపాదనను ప్రజలకు పంచిపెట్టాలి. ఇది కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో చెప్పాలి’ అని ఆనం డిమాండ్ చేశారు.
Similar News
News December 20, 2025
నెల్లూరు: వైసీపీలోనే ఆ ముగ్గురు..!

TDPకి షాక్ ఇచ్చిన నలుగురు కార్పోరేటర్లలో ముగ్గురు కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగనున్నారు. మాజీ మంత్రి అనిల్ ఆధ్వర్యంలో మద్దినేని మస్తానమ్మ, కాయల సాహిత్య, వేనాటి శ్రీకాంత్రెడ్డిలు YS జగన్ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా శుక్రవారం సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్రెడ్డిని సిటీ ఆఫీసులో కలిశారు. వైసీపీతోనే తమ పయనం సాగుతుందని TDPలో తమకు ఎటువంటి విలువ లేకుండా పోయిందని తెలిపారు.
News December 20, 2025
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. నిమ్మ, వేరుశనగ, పాలు, మాంసం జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని, వీటి నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలన్నారు.
News December 20, 2025
నెల్లూరు: వైసీపీలోనే ఆ ముగ్గురు..!

TDPకి షాక్ ఇచ్చిన నలుగురు కార్పోరేటర్లలో ముగ్గురు కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగనున్నారు. మాజీ మంత్రి అనిల్ ఆధ్వర్యంలో మద్దినేని మస్తానమ్మ, కాయల సాహిత్య, వేనాటి శ్రీకాంత్రెడ్డిలు YS జగన్ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా శుక్రవారం సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్రెడ్డిని సిటీ ఆఫీసులో కలిశారు. వైసీపీతోనే తమ పయనం సాగుతుందని TDPలో తమకు ఎటువంటి విలువ లేకుండా పోయిందని తెలిపారు.


