News June 19, 2024
YS రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలి: TNSF
యూనివర్సిటీలలో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడాన్ని TNSF నేతలు తప్పుబట్టారు. ఇందులో భాగంగా TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, కడప జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేశ్ YVU వీసీ ప్రొఫెసర్ చింత సుధాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిబంధనలకు విరుద్ధంగా యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు.
Similar News
News October 4, 2024
కడప JC అదితి సింగ్కి మరో కీలక పదవి
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.
News October 4, 2024
కమలాపురం: భూ తగాదాల్లో తోపులాట.. వ్యక్తి మృతి
కమలాపురం మండల పరిధిలోని అప్పారావుపల్లెలో భూ తగాదాల కారణంగా ఇరు వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఈ తోపులాటలో శీలం కృష్ణారెడ్డి (65) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బావా బామర్దుల మధ్య భూమి విషయంలో జరిగిన వాదనలు తోపులాటకు దారితీశాయి. ఈ సందర్భంలో కృష్ణారెడ్డికి ఒక్కసారిగా చాతినొప్పి రావడంతో కిందపడ్డారు. వెంటనే కమలాపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News October 4, 2024
కడప: కుడా వైస్ ఛైర్మన్గా అదితి సింగ్
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.