News August 23, 2024
రాష్ట్ర ప్రభుత్వానికి YS జగన్ డెడ్లైన్

AP: అచ్యుతాపురం ఘటనకు సంబంధించి బాధితులకు ఇంకా పరిహారం అందలేదని YS జగన్ ఆరోపించారు. 2-3 వారాల్లోగా బాధితులకు పరిహారం అందించాలని ఆయన డెడ్లైన్ విధించారు. ‘నేను ఇచ్చిన గడువులోగా పరిహారం ఇవ్వకుంటే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. అవసరమైతే నేను కూడా ధర్నాలో పాల్గొంటా’ అని జగన్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో 17 మంది మరణించగా, ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది.
Similar News
News November 18, 2025
కొచ్చిన్ షిప్యార్డ్లో ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.
News November 18, 2025
కొచ్చిన్ షిప్యార్డ్లో ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.
News November 18, 2025
నేడు కృష్ణాంగారక చతుర్దశి

ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని ‘కృష్ణ అంగారక చతుర్దశి’ అని అంటారు. ఈ పవిత్ర దినానికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుందట. గ్రహణం రోజున చేసే పూజలు, దానధర్మాలు అద్భుత ఫలితాలు ఇచ్చినట్లే, ఈరోజున కూడా కొన్ని ప్రత్యేక కార్యాలు చేస్తే శుభ ఫలితాలు, అదృష్టం పొందవచ్చని నమ్మకం. నేడు శివారాధన, గణపతి పూజలు చేస్తే సకల పాపాలు తొలిగిపోతాయని పండితులు చెబుతున్నారు.


