News August 23, 2024
రాష్ట్ర ప్రభుత్వానికి YS జగన్ డెడ్లైన్

AP: అచ్యుతాపురం ఘటనకు సంబంధించి బాధితులకు ఇంకా పరిహారం అందలేదని YS జగన్ ఆరోపించారు. 2-3 వారాల్లోగా బాధితులకు పరిహారం అందించాలని ఆయన డెడ్లైన్ విధించారు. ‘నేను ఇచ్చిన గడువులోగా పరిహారం ఇవ్వకుంటే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. అవసరమైతే నేను కూడా ధర్నాలో పాల్గొంటా’ అని జగన్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో 17 మంది మరణించగా, ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది.
Similar News
News February 17, 2026
హీరోయిన్గా ఖుష్బూ కూతురు

నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక సుందర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఆరంభం’ అనే మలయాళ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. సుజేశ్ అన్నీ ఈపెన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె ‘ఆరతి’ అనే పాత్రలో కనిపించనున్నారు. సుమారు 35 ఏళ్ల క్రితం ఖుష్బూ కూడా మలయాళ సినిమాతోనే కెరీర్ ప్రారంభించడం విశేషం. మలయాళం, తమిళం భాషల్లో ఈ చిత్రం విడుదలవనుంది.
News February 17, 2026
జనగామ.. ‘లక్కీ డ్రా’మా

TG: అనూహ్య పరిణామాల మధ్య జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమాన ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా తీశారు. ఇందులో కాంగ్రెస్నే అదృష్టం వరించింది. ఆ పార్టీకి చెందిన బాలమణి ఛైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. దీంతో BRS సభ్యులు నిరసనకు దిగారు. వైస్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీలోనూ లక్కీ డ్రా తీయగా కాంగ్రెస్కే ఛైర్మన్(శ్రవణ్) పదవి దక్కింది.
News February 17, 2026
ESIC కాన్పూర్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులు

<


