News September 18, 2024
బాధితులకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం

AP: ప్రత్యర్థుల దాడిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేల సాయం అందించారు. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా, బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి సాయం చేయడంతోపాటు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.
Similar News
News January 21, 2026
హైదరాబాద్లోని NIRDPRలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)లో 4 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పీజీ(బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/సోషల్ సైన్సెస్/ డెవలప్మెంట్ ఎకనామిక్స్/ రూరల్ డెవలప్మెంట్/ మేనేజ్మెంట్/సోషల్ వర్క్), B.Tech, M.Tech/MCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్సైట్: http://career.nirdpr.in//
News January 21, 2026
ప్చ్.. మాఘ మాసం వచ్చినా!

పెళ్లిళ్లతో కళకళలాడే మాఘమాసం ఈసారి ముహూర్తాలు లేక వెలవెలబోతోంది. గతేడాది NOV 26 నుంచి FEB 17(2026) వరకు మూఢం ఉండటమే ఇందుకు కారణం. శాస్త్రాల ప్రకారం మూఢంలో వివాహాది శుభకార్యాలు నిషిద్ధం. అందుకే ఈ ఏడాది మాఘమాసం మొత్తం పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. తిరిగి FEB 19 (ఫాల్గుణ మాసం) తర్వాతే కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లి కావాల్సిన యువతీయువకులు ఉగాది వరకు వేచి చూడక తప్పదని జ్యోతిషులు వివరిస్తున్నారు.
News January 21, 2026
లిక్కర్ స్కామ్ కేసు.. ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ తిరస్కరణ

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ తిరస్కరించింది. దాని కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ ముగ్గురు నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై ఉన్నారని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టేసేంత వరకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ ఉంటుందని కోర్టు వెల్లడించింది.


