News August 6, 2024

గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్

image

AP: బెంగళూరు నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు వైసీపీ కార్యకర్తలను జగన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.

Similar News

News April 1, 2026

‘ధురంధర్-2’ స్టోరీ నాదే.. కాపీ కొట్టారు: కన్నడ డైరెక్టర్

image

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘ధురంధర్-2’కు ఇప్పుడు కొత్త వివాదం చుట్టుకుంది. తన స్టోరీనే కాపీ కొట్టి సినిమా తీశారని కన్నడ డైరెక్టర్ ఆర్ఎస్ సంతోష్ కుమార్ ఆరోపించారు. 2023లోనే స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేయించానని.. టీ-సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ వంటి బడా నిర్మాణ సంస్థలకు కథ వినిపించానని తెలిపారు. ఇటీవల సినిమా చూడటంతో విషయం తెలిసిందని.. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని పేర్కొన్నారు.

News April 1, 2026

అర్షదీప్ సింగ్ ఖాతాలో చెత్త రికార్డు

image

IPL: ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన చివరి ఓవర్‌లో అర్షదీప్ ఏకంగా 11 బంతులు వేశారు. దీంతో ఐపీఎల్‌లో సుదీర్ఘ ఓవర్ వేసిన ఆరో బౌలర్‌గా నిలిచారు. ఇప్పటికే తుషార్ దేశ్‌పాండే (CSK), సిరాజ్ (RCB), హార్దిక్ పాండ్య (MI), సందీప్ శర్మ (RR), శార్దూల్ థాకూర్ (LSG) పేరిట ఈ రికార్డ్ ఉంది.

News April 1, 2026

ఈరోజు నుంచి టెక్ కంపెనీలపై దాడులు: ఇరాన్

image

గల్ఫ్‌లో అమెరికా స్థావరాలు, రిఫైనరీలపై దాడులు చేస్తున్న ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపై గురి పెట్టింది. తమపై దాడులకు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా 18 కంపెనీల ఆఫీసులపై దాడులు చేయనున్నట్లు ప్రకటించింది. ఈరోజు రాత్రి 10 నుంచి ఈ దాడులు ప్రారంభమవుతాయని.. ఉద్యోగులు ఆఫీసులు వదిలి ప్రాణాలు కాపాడుకోవాలని హెచ్చరించింది. కాగా ఇరాన్‌పై దాడుల్లో US <<19308462>>ఏఐ<<>> ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.