News August 6, 2024
గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్

AP: బెంగళూరు నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు వైసీపీ కార్యకర్తలను జగన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.
Similar News
News October 28, 2025
ఇంట్లో కాలుష్యానికి వీటితో చెక్

ప్రస్తుతకాలంలో కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం కష్టంగా మారింది. ఆరుబయటే కాదు ఇంట్లో కూడా కాలుష్యం విస్తరిస్తోంది. దీన్ని తగ్గించాలంటే ఇంట్లో కొన్నిమొక్కలు పెంచాలంటున్నారు నిపుణులు. బోస్టన్ ఫెర్న్, స్పైడర్ ప్లాంట్, వీపింగ్ ఫిగ్, పీస్ లిల్లీ, ఇంగ్లిష్ ఐవీ మొక్కలు గాలిని శుభ్రం చేయడంలో సహాయం చేస్తాయి. గాలి కాలుష్యాన్ని తొలగించి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయంటున్నారు.
News October 28, 2025
శివుడి కోసం సతీదేవి ఏం చేసిందంటే..?

సతీదేవికి శివునిపై ఉన్న ప్రేమను, భర్త గౌరవం పట్ల ఆమెకున్న నిబద్ధతను దక్షయజ్ఞ ఘట్టం మనకు నిరూపిస్తుంది. శివుడిని దక్షుడు అవమానించడం ఆమె సహించలేకపోయింది. శివుని ఔదార్యాన్ని వివరించి, దక్షుడి అహంకారాన్ని ఖండించింది. శివునిపై ద్వేషం పెంచుకున్న తండ్రి నుంచి వచ్చిన ఈ శరీరం శివుని అవమానంతో కలుషితమైందని భావించింది. అందుకే, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి యోగాగ్ని ద్వారా దేహత్యాగం చేసింది. <<-se>>#Shakthipeetham<<>>
News October 28, 2025
మచిలీపట్నానికి 70kmల దూరంలో తుఫాన్

AP: బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ గంటకు 15km వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 70 km, కాకినాడకు 150 km, విశాఖపట్నానికి 250 km దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 90-110కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.


