News July 23, 2024
నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టు చేరుకుని అక్కడి నుంచి విమానంలో హస్తినకు చేరుకుంటారు. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. కాగా.. రాష్ట్రంలోని ఎన్డీయే సర్కారు పాలనను నిరసిస్తూ రేపు ఢిల్లీలో ధర్నాకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఆయన పాల్గొననున్నారు.
Similar News
News January 29, 2026
పేపర్ ప్లేట్గా బ్యాంకు డాక్యుమెంట్.. ప్రైవసీ అంటే ఇదేనా?

కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్న బ్యాంకు డాక్యుమెంట్ రోడ్డు పక్కన పేపర్ ప్లేట్గా మారడం ఇప్పుడు వైరలవుతోంది. పేరు, లొకేషన్, పేమెంట్ డీటెయిల్స్ వంటి సెన్సిటివ్ డేటా బహిరంగంగా కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. కస్టమర్ డేటాను బ్యాంకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తాయని ప్రశ్నిస్తున్నారు. Moronhumor పేరిట ఉన్న X అకౌంట్లో ఈ ఫొటో చూశాక డేటా ప్రైవసీపై SMలో పెద్ద చర్చే నడుస్తోంది.
News January 29, 2026
RBIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News January 29, 2026
KCRకు నోటీసుల్లో దురుద్దేశం లేదు: మహేశ్గౌడ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు నోటీసులివ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ తెలిపారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందని, SIT ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చన్నారు. గత CM, మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. పూర్తి విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని, కేసులో భాగస్వాములు ఎవరో తేలాల్సి ఉందన్నారు.


