News July 5, 2024

రేపు పులివెందులకు వైఎస్ జగన్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం నియోజకవర్గానికి వెళ్లనున్న ఆయన.. 2 రోజులు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News July 8, 2024

హైదరాబాద్‌లో చంద్రబాబు, వైఎస్సార్ ఫ్లెక్సీలు

image

చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో చంద్రబాబు, వైఎస్సార్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చంద్రబాబువి, జయంతి సందర్భంగా వైఎస్సార్ ఫ్లెక్సీలను టీడీపీ, కాంగ్రెస్ అభిమానులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీలో ఈ ఇద్దరు నాయకులు సీఎంలుగా హైదరాబాద్ నుంచే పాలన సాగించారు. కాగా, తెలంగాణలోనూ టీడీపీ జెండా ఎగరేస్తామని చంద్రబాబు నిన్న కార్యకర్తల సమావేశంలో చెప్పారు.

News July 8, 2024

T20WC: ఒక్కో క్రికెటర్‌కు ₹5కోట్లు

image

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు BCCI ₹125కోట్లు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని పంచగా 15మంది ఆటగాళ్లు, కోచ్ ద్రవిడ్‌కి ఒక్కొక్కరికి ₹5కోట్లు రానున్నాయి. మిగిలిన కోచ్‌లు ₹2.5కోట్ల చొప్పున అందుకుంటారు. బ్యాక్‌రూమ్ స్టాఫ్ తలా ₹2కోట్లు, సెలెక్షన్ కమిటీలోని సభ్యులు, రిజర్వ్ ప్లేయర్లు ₹కోటి చొప్పున అందుకుంటారు. వాంఖడేలో ఇప్పటికే దీనికి సంబంధించిన చెక్కును BCCI జట్టుకు అందించింది.

News July 8, 2024

PHOTOS: పూరీ తీరంలో రాష్ట్రపతి

image

ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మార్నింగ్ వాక్ చేశారు. ‘తీరం వెంబడి నడుస్తున్నపుడు అలల సవ్వడి, చల్లని గాలి, సముద్రపు హోరు ధ్యానం చేస్తున్న అనుభూతిని కలిగించాయి. నిన్న జగన్నాథుడిని దర్శించినపుడు ఇలాంటి అనుభవమే కలిగింది’ అని Xలో పేర్కొన్నారు. ప్రకృతి వనరులు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయని, అలాంటి ప్రకృతిని ధ్వంసం కాకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.