News January 26, 2025

పద్మ అవార్డు గ్రహీతలకు YS జగన్ విషెస్

image

పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం), నంద‌మూరి బాల‌కృష్ణ (క‌ళ‌లు), మంద కృష్ణ మాదిగ (ప్ర‌జా వ్య‌వ‌హారాలు), మాడుగుల నాగ‌ఫ‌ణి శ‌ర్మ (క‌ళ‌లు), కేఎల్ కృష్ణ (విద్య‌, సాహిత్యం), మిరియాల అప్పారావు (మ‌ర‌ణానంత‌రం) (క‌ళ‌లు), వాదిరాజు రాఘ‌వేంద్రాచారి పంచ‌ముఖి (విద్య, సాహిత్యం)’ అని వారి పేర్లను ట్వీట్ చేశారు.

Similar News

News October 31, 2025

సర్దార్ పటేల్ ఫ్యామిలీతో మోదీ భేటీ

image

భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వారితో సంభాషణ, దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం గొప్పగా ఉందని Xలో పేర్కొన్నారు. గుజరాత్‌లోని కేవడియాలో సర్దార్ పటేల్‌ 150వ జయంతి వేడుకల్లో ఆయనకు నివాళిగా స్పెషల్ కాయిన్, స్టాంప్‌ను మోదీ రిలీజ్ చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం(182 మీటర్లు) ఉంది.

News October 31, 2025

వర్డ్ ఆఫ్ ది ఇయర్ తెలుసా?

image

ఈ ఏడాదికి ‘67‌’ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రముఖ ఆన్‌లైన్ డిక్షనరీ వెబ్‌సైట్ డిక్షనరీ.కామ్ ప్రకటించింది. నంబర్‌ను పదంగా పేర్కొనడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి అర్థం లేదని, నిర్వచించలేమని వెబ్‌సైట్ స్పష్టం చేసింది. అమెరికన్ ర్యాపర్ స్క్రిల్లా డ్రిల్ <>సాంగ్<<>> ‘Doot Doot (6 7)’ నుంచి ఇది పుట్టిందని, టీనేజర్స్, జెన్ఆల్ఫా(2010-25 మధ్యలో పుట్టినవారు) దీనిని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. మీరూ ఉపయోగించారా?

News October 30, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటలలోపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.