News January 7, 2025
YS జగన్ సమీప బంధువు మృతి

AP: YS జగన్ సమీప బంధువు అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్తో మూడు నెలల నుంచి కోమాలో ఉన్న ఆయన HYD AIGలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. YS ప్రకాశ్ రెడ్డి మనవడు అయిన ఆయన జగన్కు సోదరుడి వరుస అవుతారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ విజయం కోసం ఆయన తీవ్రంగా పనిచేశారు. బెంగళూరులో స్కూలు విద్యాభ్యాసం, ఖమ్మం మమతా కాలేజీలో MBBS చదివారు.
Similar News
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.
News November 8, 2025
కర్ణాటక స్పెషల్ డ్రైవ్… 102 ప్రైవేట్ బస్సులు సీజ్

కర్నూలు దగ్గర <<18155705>>బస్సు<<>> ప్రమాదంలో 19 మంది మృతితో కర్ణాటక GOVT PVT ట్రావెల్స్పై కఠిన చర్యలకు దిగింది. 12 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. OCT24 నుంచి NOV 5 వరకు 4452 బస్సుల్ని తనిఖీ చేసి 102 బస్సుల్ని సీజ్ చేసింది. 604 కేసులు నమోదు చేసిన అధికారులు ₹1,09,91,284 జరిమానా వసూలు చేశారు. కాగా AP, TGల్లో మాత్రం కొద్దిరోజులు హడావుడి చేసి తరువాత మిన్నకుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


