News February 3, 2025
ముద్రగడకు YS జగన్ పరామర్శ

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని మాజీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శించారు. నిన్న ఆయన నివాసంపై <<15338401>>దాడి<<>> జరిగిన ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఆయనకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిన్న తెల్లవారుజామున మద్యం మత్తులో ఓ యువకుడు ముద్రగడ ఇంటిని ట్రాక్టర్తో ఢీకొట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News March 23, 2026
కేంద్రం షాక్.. RRRకు ఎక్స్ప్రెస్ వే హోదా రద్దు

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఎక్స్ప్రెస్ వే హోదాను రద్దు చేసి సాధారణ జాతీయ రహదారి స్టేటస్ కల్పించింది. ప్రాజెక్ట్ వ్యయం ₹38వేల కోట్లకుపైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో RRR స్పీడ్ లిమిట్ 120-130KMPH నుంచి 100కు తగ్గనుంది. అలాగే 8 లేన్ రోడ్డును రాష్ట్రం ప్రతిపాదించగా కేంద్రం దానిని ఇప్పుడు ఆరుకు కుదించింది.
News March 23, 2026
కేంద్రం షాక్.. RRRకు ఎక్స్ప్రెస్ వే హోదా రద్దు

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఎక్స్ప్రెస్ వే హోదాను రద్దు చేసి సాధారణ జాతీయ రహదారి స్టేటస్ కల్పించింది. ప్రాజెక్ట్ వ్యయం ₹38వేల కోట్లకుపైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో RRR స్పీడ్ లిమిట్ 120-130KMPH నుంచి 100కు తగ్గనుంది. అలాగే 8 లేన్ రోడ్డును రాష్ట్రం ప్రతిపాదించగా కేంద్రం దానిని ఇప్పుడు ఆరుకు కుదించింది.
News March 23, 2026
రూర్బన్ పంచాయతీలు.. ఏప్రిల్ 24న ప్రారంభం!

AP: రాష్ట్రంలో పంచాయతీల పునర్విభజన తర్వాత 359 గ్రామాలు <<19342076>>రూర్బన్<<>> కేటగిరీలోకి చేరాయి. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24న ప్రభుత్వం వీటిని ప్రారంభించనుంది. అక్కడ పట్టణ తరహా సదుపాయాలు, పౌర సేవలు అందించనుంది. డిప్యూటీ ఎంపీడీవో, సీనియర్ పంచాయతీ కార్యదర్శులు గెజిటెడ్ హోదాలో విధులు నిర్వర్తించనున్నారు. ఇక గ్రేడ్-1లో 3,082, గ్రేడ్-2లో 3,163, గ్రేడ్-3లో 6,747 పంచాయతీలు ఉన్నాయి.


